Movie News

Jayalalitha: నటి జయలలిత మరణం పై వెలుగులోకి వచ్చిన నిజాలు.. ఆ విషయాలన్నీ బయటపెట్టిన ఆర్ముగ స్వామి కమిషన్!

Jayalalitha: తమిళనాడు ప్రజలకు అమ్మగా ఎంతో మంచి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న నటి దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం నుంచి ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు కోలుకోలేకపోతున్నారు. ఈమె మరణించి సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ ఈమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే నటి జయలలిత మరణం పై ఎన్నో అనుమానాలు కూడా గతంలో వ్యక్తం అయ్యాయి.

ఈ క్రమంలోనే జయలలిత మరణం పై తమిళనాడు ప్రభుత్వం ఆర్ముగ స్వామి కమిషన్ ద్వారా విచారణ చేపట్టాలనీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కమిషన్ ఒక రిపోర్ట్ తయారుచేసి తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదికలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ క్రమంలోనే దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5 వ తేదీ రాత్రి 10 గంటలకు మరణించారని అపోలో హాస్పిటల్ వైద్యులు అధికారికంగా వెల్లడించారు. అయితే ఈమె మరెన్నో వార్త పై ఎన్నో అనుమానాలు సందేహం వ్యక్తం అవడంతో తమిళనాడు ప్రభుత్వం అమ్మ మరణం పై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు.

Jayalalitha వెలుగులోకి వచ్చిన నిజాలు…

ఈ క్రమంలోనే ఆర్ముగ స్వామి కమిషన్ జయలలిత మరణం పై దర్యాప్తు చేసిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం జయలలిత డిసెంబర్ 4 మధ్యాహ్నం 3:50 సమయంలోనే మరణించారని పేర్కొన్నారు. అయితే ఈమె డిసెంబర్ 4వ తేదీ మరణించడంతో డిసెంబర్ 5న అధికారకంగా ప్రకటించారు. మరి ఈ 31 గంటల వ్యవధిలో ఏం జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago