Featured

Jayamalini : జీవితా రాజశేఖర్ ఇంటికి వెళితే మజ్జిగ ఇచ్చారు… ఎలా ఉందంటే…: జయమాలిని

Jayamalini : డెబ్భైయ్యో దశకములో ఐటమ్ సాంగ్ అనగానే గుర్తొచ్చేది జ్యోతి లక్ష్మి, జయమాలిని. అప్పట్లో వీరిద్దరూ ట్రెండ్ సెట్ చేసారు. ఎంతటి అగ్ర హీరో అయినా వీరి ఐటమ్ సాంగ్ ఒకటి ఉండాల్సిందే అన్నట్లుగా డిమాండ్ ఉండేది వీరికి. నిజానికి జయమాలిని వచ్చాక జ్యోతిలక్ష్మి కి అవకాశాలు తగ్గాయానే చెప్పాలి. మొదటి నుండి సినిమ నేపథ్యం ఉండటం వల్ల జ్యోతి లక్ష్మి గారు డాన్స్ నేర్చుకుంటున్న గురువు దగ్గరే జయమాలిని డాన్స్ నేర్చుకున్నారు. అలా ఒకసారి వారి ఇంటికి వచ్చిన విఠలాచార్యా గారు జయమాలనిని చూసి ఆయన తెలుగు సినిమా ‘ఆడదాని అదృష్టం’లో అవకాశం ఇచ్చారు. ఇక జయమాలిని ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమాలో హీరోయిన్ గా చేసారు. ‘జగన్మోహని’ సినిమాలో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన జయమాలిని గారు ఆ తరువాత స్పెషల్ సాంగ్స్ లో ఒక ఊపు ఉపేశారు.

జీవితా రాజశేఖర్ ఇంటికి వెళితే మజ్జిగ ఇచ్చారు…

జయమాలిని సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పనిచేయడం లేదు, తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నారు. అయినా తన అభిమానులను, తనతో పనిచేసిన ఆర్టిస్టులను మాత్రం మర్చిపోలేదు. అందుకే తాజాగా చెన్నై నుండి హైదరాబాద్ కు తన స్నేహితురాలిని చూడటానికి వచ్చి తాను కలిసి పనిచేసిన వారిని వెళ్లి పలకరించి వచ్చారు. అలా చిరంజీవి, బాలకృష్ణ, జీవిత, గిరిబాబు, రోజా రమణి వంటి వారిని కలిశారట. అదేపనిగా అందరినీ కలవాలని ఒక రోజు ఎక్కువ హైదరాబాద్ లో ఉండి మరీ అందరినీ కలిసారటా జయమాలిని.

అలా చిరు, బాలయ్య ను కలిసాక జీవితా రాజశేఖర్ ఇంటికి వెళితే ఆమె చాలా బాగా రిసీవ్ చేసుకున్నారంటూ తెలిపారు. వెళ్ళగానే మజ్జిగ ఇచ్చి చాలా బాగా మాట్లాడారు. చాలా బాగున్నాయి మజ్జిగ, తనతో కాసేపు మాట్లాడి ఆ తరువాత గిరిబాబు గారి ఇంటికి వెళ్ళాను అంటూ తెలిపారు. గిరిబాబు గారు వృధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన చాలా వరకు విషయాలు మర్చిపోయారు. వెళ్లి నేను జయమాలిని అని చెబితే కాసేపటికి గుర్తు పట్టి మాట్లాడారు అంటూ జయమాలిని అందరి గురించి చెప్పారు.

Bhargavi

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

4 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

4 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

4 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

4 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

4 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

4 hours ago