ప్రేమ గుడ్డిదని, ప్రేమ మాయలో పడితే ఎంతటి సాహసానికైనా ఒడిగడతారని ఇది మనం వినే ఉంటాం. అచ్చం అలాగే ఓ కుర్రాడు దూరంగా ఉన్న తన ప్రియురాలి కోసం ఓ పెద్ద సాహసం చేశాడు. తన ప్రియురాలిని చూడడానికి ఏకంగా సముద్రాలు దాటి వెళ్ళాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ప్రియురాలిని చూడటానికి వెళితే జైల్లో ఎందుకు పెట్టారో పూర్తి వివరాలు తెలుసుకుందాం..
స్కాట్లాండ్కు చెందిన 28 ఏళ్ల డేల్ మెక్లాగన్ అతను జెస్సికా రెడ్ క్లిఫ్ కానీ అమ్మాయిని ప్రేమించాడు.ఐరీష్ సముద్రంలోని ‘ఐల్ ఆఫ్ మన్’ దీవిలో గత సంవత్సరం పని చేయడానికి వెళ్లిన అతను అక్కడే ఉన్న జెస్సికాతో ప్రేమలో పడ్డాడు. అయితే అతని పని కాంట్రాక్ అయిపోవడంతో తిరిగి తన స్వస్థలానికి వెళ్లిన మెక్లాగన్ తన ప్రేయసి మీద బెంగతో ఎలాగైనా తనని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
‘ఐల్ ఆఫ్ మన్’ దీవిలో ఉన్న తన ప్రేయసిని కలుసుకోవడానికి అధికారులను అనుమతి కోరగ అందుకు వారు తిరస్కరించారు. ఎలాగైనా తన ప్రేయసిని కలుసుకోవాలని ఏకంగా ఓ జెట్ స్కై కొనుక్కొని తన ప్రేయసి కోసం బయలుదేరాడు. అయితే జెట్ స్కై నడవడం అలవాటు లేని కారణంగా అతని ప్రయాణం నాలుగు గంటల పాటు సాగింది. ఎంతో కష్టపడి తన ప్రేయసిని కలుసుకుని మాట్లాడారు.తరువాత నైట్ ఇద్దరు కలిసి క్లబ్ కి వెళ్లడంతో అక్కడ పోలీసుల కంటపడటంతో అతనిని పోలీసులు అరెస్టు చేశారు.
అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి,కోవిడ్ నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టి నగరం దాటి వచ్చిన అతనిని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు. దీంతో కోర్టు అతనికి నాలుగు వారాల పాటు జైలు శిక్షను విధించింది. అయితే ప్రస్తుతం మెక్లాగన్ తన ప్రేయసి కోసం చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అతనిని ఒక రోమియో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
వేసవి వచ్చేసరికి ప్రతి ఇంట్లో ఫ్యాన్లు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. అయినప్పటికీ కొన్ని రోజుల్లోనే ఫ్యాన్ రెక్కలపై నల్లటి దుమ్ము…
వేసవి కాలంలో శరీరంలో వేడి పెరగడం సహజం. అందుకే ఈ సీజన్లో చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు…
ఉత్తరాఖండ్లో జరిగిన ఒక విచిత్ర వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సంప్రదాయాలకు విరుద్ధంగా, ఒక జంట శ్మశాన వాటికలో…
వేసవి కాలం మొదలైతే చల్లని పానీయాల వైపు అందరూ మొగ్గు చూపుతారు. ముఖ్యంగా చెరకు రసం, కొబ్బరి నీరు వంటి…
నేటి జీవనశైలిలో గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి…
ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత అంశంపై జరిగిన నిరసన కార్యక్రమం ఇప్పుడు అనూహ్యంగా జంతు హింస వివాదానికి దారితీసింది. తిరుపతిలో వైసీపీ…