Jinna Movie: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.ఒక సినిమాని చేయాలంటే చిన్న నిర్మాతలకు అధిక భారంగా మారుతుందని గత కొద్ది రోజుల క్రితం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సినిమాలను షూటింగ్లను ఆపివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయాల గురించి తాజాగా నిర్మాత రామ సత్యనారాయణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చిత్ర పరిశ్రమ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఒక సినిమాని థియేటర్లో విడుదల చేయాలంటే వారానికి వీపీఎఫ్ చార్జీలను పదివేలకు పైగా చెల్లించాల్సి ఉంటుందనీ వెల్లడించారు.భారీ బడ్జెట్ సినిమాలకు ఇలా విపిఎఫ్ చార్జీలను చెల్లించడం పెద్ద సమస్య కాదు కానీ చిన్న నిర్మాతలకు అది అదనపు భారంగా మారుతుందని నిర్మాత రామ సత్యనారాయణ వెల్లడించారు. ఒక చిన్న నిర్మాత కోటి రూపాయలు పెట్టి సినిమా చేస్తే ఒకవేళ ఆ సినిమా నష్టం వస్తే కోటి రూపాయలతో పాటు సినిమా ప్రమోషన్ల కోసం ఖర్చు చేసే డబ్బులు ఇలా ఈ వీపీఎఫ్ చార్జీల వల్ల అదనపు భారం తమాపై పడుతూ భారీగా నష్టపోతున్నారని అందుకే చిన్న నిర్మాతలు ఇండస్ట్రీకి దూరమవుతున్నారని ఈయన పేర్కొన్నారు. ఇలా ఒక చిన్న సినిమా నిర్మాత సినిమా ఫెయిల్ అయితే 140 శాతం నష్టపోవాల్సి వస్తుందని ఈయన తెలిపారు.
ఇకపోతే దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి ఎంతోమంది ప్రొడ్యూసర్ల చేతిలో పెద్ద ఎత్తున థియేటర్లో ఉన్నాయి అయితే దిల్ రాజు గారు చిన్న సినిమాలకు ఈ విధమైనటువంటి విపిఎఫ్ చార్జీలు ఉండవని ఆయన చిన్న సినిమా నిర్మాతలను ఎంతగానో ప్రోత్సహించారని రామ సత్యనారాయణ పేర్కొన్నారు.ఇకపోతే ఇంటర్వ్యూలో భాగంగా మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమాపై ప్రేక్షకులు పగ పట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జిన్నా సినిమాలో సుమారు పాతిక కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి చేశారు.ఈ సినిమాలో క్యాస్టింగ్ తో పాటు సినిమా కూడా అద్భుతంగా ఉంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ సినిమా భారీగా నష్టపోయిందని ప్రేక్షకులు సినిమాపై పగ పట్టారంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మంచు విష్ణు ఈ సినిమాని భారీ బడ్జెట్ పెట్టి కేటాయించినప్పటికీ ఈ సినిమా ప్రమోషన్ల కోసం సుమారు కోటి రూపాయలకు పైగా ఖర్చుపెట్టి నష్టపోయారంటూ ఈయన వెల్లడించారు. ప్రస్తుతం జిన్నా సినిమా గురించి రామ సత్యనారాయణ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…