Balakrishna -Chiranjeevi:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి హీరోల సినిమాలు పోటీ పడటం సర్వసాధారణం ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి నరసింహ బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఒకేసారి పెద్ద ఎత్తున పోటీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అయితే తాజాగా ఈ ఇద్దరు హీరోల మధ్య మరోసారి పెద్ద ఎత్తున పోటీ ఏర్పడనుందని తెలుస్తుంది.మైత్రి మూవీ మేకర్ నిర్మాణంలో బాలకృష్ణ చిరంజీవి ఇద్దరు కూడా సంక్రాంతికి సినిమాలను విడుదల చేయబోతున్నారు.
ఈ క్రమంలోనే ఓకే నిర్మాణ సంస్థలో తెర కెక్కిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అయితే కలెక్షన్లకు దెబ్బ పడుతుందన్న ఉద్దేశంతో మైత్రి మూవీ మేకర్స్ బాలకృష్ణను సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాలని ఆయనని ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై బాలయ్య రియాక్షన్ వల్ల మైత్రి మూవీ మేకర్స్ కాస్త టెన్షన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ మైత్రి మూవీ మేకర్స్ బాలయ్య సినిమాని వెనక్కు తగ్గాలని ఎందుకు చెబుతున్నారు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి పోటీ పడబోతున్నాయి. అయితే నిర్మాతలు బాలకృష్ణను వెనక్కు తగ్గమని చెప్పడానికి ఓ కారణం ఉందని భరద్వాజ వెల్లడించారు.వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి పూర్తి మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ తరహా పాత్రలలో చిరంజీవి నటించి చాలా కాలం అయింది.ఇక ఈ మధ్యకాలంలో చిరంజీవి సినిమాలు కాస్త కలెక్షన్ల విషయంలో వెనుక పడ్డాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి కానుకగా చిరంజీవి సినిమాను విడుదల చేస్తే మంచి కలెక్షన్లను రాబడతాయన్న ఉద్దేశంలో మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారని ఈయన క్లారిటీ ఇచ్చారు.
ఇకపోతే వీరసింహారెడ్డి సినిమా పూర్తి పొలిటికల్ యాక్షన్ సినిమా. ఈ తరహా సినిమాలు బాలకృష్ణ ఎన్నో సినిమాలలో చేశారు కనుక ఈ సినిమాని మరి కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని బాలకృష్ణను సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ మాత్రం తగ్గేది లే అంటూ తన సినిమాని తప్పనిసరిగా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారట.బాలకృష్ణ సంక్రాంతి బరి నుంచి తన సినిమా తప్పుకోవాలంటే మైత్రి మూవీ మేకర్స్ వారికి ఓ ఆఫర్ కూడా ఇచ్చారని ఈ సందర్భంగా భరద్వాజ తెలిపారు.తన సినిమా సంక్రాంతి భరి నుంచి తప్పుకోవాలంటే సినిమా కోసం ఎంత మేర ఖర్చు పెట్టారో ఆ డబ్బును వేరే ప్రొడక్షన్ చెల్లించి ఆ సినిమాని అమ్మితే ఆ ప్రొడక్షన్ నుంచి సంక్రాంతి కానుకగా విడుదల చేస్తానని బాలయ్య చెప్పారట.ఇలా బాలకృష్ణ ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని పట్టు పట్టారని జర్నలిస్ట్ భరద్వాజ పేర్కొన్నారు. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ఏ హీరో వీరులవుతారో తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…