Connect with us

Featured

Balakrishna -Chiranjeevi: సంక్రాంతి బరి తప్పుకోవాలని బాలయ్య పై ఒత్తిడి తెచ్చిన మైత్రి మూవీ మేకర్స్… బాలయ్య రియాక్షన్ ఇదే?

Published

on

Balakrishna -Chiranjeevi:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి హీరోల సినిమాలు పోటీ పడటం సర్వసాధారణం ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి నరసింహ బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఒకేసారి పెద్ద ఎత్తున పోటీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అయితే తాజాగా ఈ ఇద్దరు హీరోల మధ్య మరోసారి పెద్ద ఎత్తున పోటీ ఏర్పడనుందని తెలుస్తుంది.మైత్రి మూవీ మేకర్ నిర్మాణంలో బాలకృష్ణ చిరంజీవి ఇద్దరు కూడా సంక్రాంతికి సినిమాలను విడుదల చేయబోతున్నారు.

ఈ క్రమంలోనే ఓకే నిర్మాణ సంస్థలో తెర కెక్కిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అయితే కలెక్షన్లకు దెబ్బ పడుతుందన్న ఉద్దేశంతో మైత్రి మూవీ మేకర్స్ బాలకృష్ణను సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాలని ఆయనని ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై బాలయ్య రియాక్షన్ వల్ల మైత్రి మూవీ మేకర్స్ కాస్త టెన్షన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ మైత్రి మూవీ మేకర్స్ బాలయ్య సినిమాని వెనక్కు తగ్గాలని ఎందుకు చెబుతున్నారు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి పోటీ పడబోతున్నాయి. అయితే నిర్మాతలు బాలకృష్ణను వెనక్కు తగ్గమని చెప్పడానికి ఓ కారణం ఉందని భరద్వాజ వెల్లడించారు.వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి పూర్తి మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ తరహా పాత్రలలో చిరంజీవి నటించి చాలా కాలం అయింది.ఇక ఈ మధ్యకాలంలో చిరంజీవి సినిమాలు కాస్త కలెక్షన్ల విషయంలో వెనుక పడ్డాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి కానుకగా చిరంజీవి సినిమాను విడుదల చేస్తే మంచి కలెక్షన్లను రాబడతాయన్న ఉద్దేశంలో మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారని ఈయన క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Balakrishna -Chiranjeevi: బాలయ్య నిర్ణయంతో టెన్షన్ లో మైత్రి మూవీస్…

ఇకపోతే వీరసింహారెడ్డి సినిమా పూర్తి పొలిటికల్ యాక్షన్ సినిమా. ఈ తరహా సినిమాలు బాలకృష్ణ ఎన్నో సినిమాలలో చేశారు కనుక ఈ సినిమాని మరి కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని బాలకృష్ణను సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ మాత్రం తగ్గేది లే అంటూ తన సినిమాని తప్పనిసరిగా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారట.బాలకృష్ణ సంక్రాంతి బరి నుంచి తన సినిమా తప్పుకోవాలంటే మైత్రి మూవీ మేకర్స్ వారికి ఓ ఆఫర్ కూడా ఇచ్చారని ఈ సందర్భంగా భరద్వాజ తెలిపారు.తన సినిమా సంక్రాంతి భరి నుంచి తప్పుకోవాలంటే సినిమా కోసం ఎంత మేర ఖర్చు పెట్టారో ఆ డబ్బును వేరే ప్రొడక్షన్ చెల్లించి ఆ సినిమాని అమ్మితే ఆ ప్రొడక్షన్ నుంచి సంక్రాంతి కానుకగా విడుదల చేస్తానని బాలయ్య చెప్పారట.ఇలా బాలకృష్ణ ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని పట్టు పట్టారని జర్నలిస్ట్ భరద్వాజ పేర్కొన్నారు. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ఏ హీరో వీరులవుతారో తెలియాల్సి ఉంది.

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!