Jogi Naidu : అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన జోగి నాయుడు గారు జెమినీ టీవీలో వస్తున్న జోగి బ్రదర్స్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు డైరెక్టర్స్ తో పనిచేస్తూనే మరోవైపు సినిమాల్లో కమెడియన్గా కూడా చేసారు. ఇక జెమినీ టీవీలో పనిచేస్తున్న సమయంలోనే యాంకర్ ఝాన్సీ గారితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. ఇక జోగి నాయుడు గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. పెళ్లి విడాకుల వల్ల పిల్లలు ఇబ్బందుల్లో పడుతారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
సినిమాలు ఆగిపోడానికి కారణం…
జోగి నాయుడు ఆర్టిస్ట్ అయ్యాక జోగి బ్రదర్స్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఎదిగిన జోగి నాయుడు స్వంతంగా స్టూడియో పెట్టేసారు. అయితే స్టూడియో పెట్టాక సినిమాలను నిర్మించాలని అనుకున్నారు అలా పెద్ధ వంశీ గారితో కథ కుదిరాక షూటింగ్ కి వెళ్లాల్సిన సమయంలో సినిమా ఆగిపోయిందట.
ఇక బాపు గారి దర్శకత్వంలో ‘మంత్రి గారి వియ్యంకుడు’ సినిమాను రీమేక్ చేయాలని అది కూడా రవితేజ హీరోగా చేయాలని అనుకుని బాపు గారిని ఒప్పించి రవితేజ వద్దకు వెళితే మొదట చేయాలని అనుకున్నా ఆపైన బిజీగా అయిపోవడంతో పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకుని వెళ్లి చెబితే ఆయన నాగబాబు కూడా ఇలాంటి ఒక రీమేక్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పడంతో అలా ఆ ప్రొజెక్ట్ పోయింది అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…