Featured

Jogi Naidu : రవితేజ చేయనన్నాడని పవన్ కళ్యాణ్ ని కలిస్తే… ఆయన షాక్ ఇచ్చాడు… వంశీ, బాపు దర్శకత్వంలో సినిమాలు ఆగిపోడానికి కారణం…: జోగి నాయుడు

Jogi Naidu : అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన జోగి నాయుడు గారు జెమినీ టీవీలో వస్తున్న జోగి బ్రదర్స్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు డైరెక్టర్స్ తో పనిచేస్తూనే మరోవైపు సినిమాల్లో కమెడియన్గా కూడా చేసారు. ఇక జెమినీ టీవీలో పనిచేస్తున్న సమయంలోనే యాంకర్ ఝాన్సీ గారితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. ఇక జోగి నాయుడు గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. పెళ్లి విడాకుల వల్ల పిల్లలు ఇబ్బందుల్లో పడుతారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

సినిమాలు ఆగిపోడానికి కారణం…

జోగి నాయుడు ఆర్టిస్ట్ అయ్యాక జోగి బ్రదర్స్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఎదిగిన జోగి నాయుడు స్వంతంగా స్టూడియో పెట్టేసారు. అయితే స్టూడియో పెట్టాక సినిమాలను నిర్మించాలని అనుకున్నారు అలా పెద్ధ వంశీ గారితో కథ కుదిరాక షూటింగ్ కి వెళ్లాల్సిన సమయంలో సినిమా ఆగిపోయిందట.

ఇక బాపు గారి దర్శకత్వంలో ‘మంత్రి గారి వియ్యంకుడు’ సినిమాను రీమేక్ చేయాలని అది కూడా రవితేజ హీరోగా చేయాలని అనుకుని బాపు గారిని ఒప్పించి రవితేజ వద్దకు వెళితే మొదట చేయాలని అనుకున్నా ఆపైన బిజీగా అయిపోవడంతో పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకుని వెళ్లి చెబితే ఆయన నాగబాబు కూడా ఇలాంటి ఒక రీమేక్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పడంతో అలా ఆ ప్రొజెక్ట్ పోయింది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

4 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

4 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

4 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

4 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

4 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

4 hours ago