Bichagadu: ప్రముఖ తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి తెలియని వారంటూ ఉండరు. విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. గతంలో విడుదలైన ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి హీరోగా విజయ్ ని మరొక మెట్టు ఎక్కించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఆ సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు 2 సినిమాని రూపొందించారు.
ఈ సినిమా మే 19వ తేదీన తెలుగు,తమిళ్ భాషలలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ఓ ఈవెంట్లో విజయ్ ఆంటోనీ పాల్గొన్నారు . ఈ క్రమంలో బిచ్చగాడు2 సినిమా గురించి అనేక ఆసక్తికర విషయం అభిమానులతో పంచుకున్నాడు.
ఈ సినిమాలో హీరో బిచ్చగాడి పాత్రలో నటించడం వల్ల సినిమాకు బిచ్చగాడు 2 పేరు పెట్టవలసి వచ్చింది. అయితే ఈ సినిమాకి 2016లో విడుదలైన బిచ్చగాడు సినిమాకి ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు. ఆ సినిమాలు తల్లి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం చక్కగా చూపించాము. ఇక బిచ్చగాడు 2 లో అన్నా చెల్లెలు సెంటిమెంట్ ఉంటుందని తెలిపాడు. ఇక ఈ క్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.
ఇక ఈ ఈవెంట్ లో ..’ఒకవేళ బిచ్చగాడు సీక్వెల్ చిత్రాల్లో మీరుకాకుండా వేరే ఏ హీరో అయితే బాగుంటారు? అని విజయ్ ఆంటోనీని ప్రశ్నించగా… తెలుగులో సూపర్ స్టార్ మహేశ్బాబు అయితే బిచ్చగాడు 2 కి బాగా సూట్ అవుతారని చెప్పుకొచ్చాడు. అలాగే తమిళంలో అయితే విజయ్ దళపతి లేదా అజిత్ బాగా సూట్ అవుతారని చెప్పుకొచ్చారు. అయితే బిచ్చగాడు పాత్రకి మహేష్ బాబు సెట్ అవుతాడని విజయ్ ఆంటోనీ చేసిన వ్యాఖ్యలపై మహేష్ అభిమానులు మండిపడుతున్నారు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…