Featured

Jogi Naidu : సౌందర్య డూప్ గా ఫైట్ చేశాను… త్రివిక్రమ్ చెప్తా సామి అంటాడు కానీ… ఇంతవరకు చెప్పలేదు… పరుశురాం నా బంధువే…: జోగినాయుడు

Jogi Naidu : అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన జోగి నాయుడు గారు జెమినీ టీవీలో వస్తున్న జోగి బ్రదర్స్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు డైరెక్టర్స్ తో పనిచేస్తూనే మరోవైపు సినిమాల్లో కమెడియన్ గా కూడా చేసారు. ఇక జెమినీ టీవీలో పనిచేస్తున్న సమయంలోనే యాంకర్ ఝాన్సీ గారితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. ఇక జోగి నాయుడు గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

సౌందర్య డూప్ గా చేశా…

అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూనే మరోవైపు యాంకరింగ్ చేసుకుంటూ ఉన్న జోగి నాయుడు గారు కృష్ణ వంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవారు. అలా అంతఃపురం సినిమా టైములో ఒక చిన్న సీన్ లో కూడా కనిపిస్తాను. ఇక ఒక సీన్ లో సౌందర్య గారితో యాక్షన్ సన్నివేశం సమయంలో ఆమె రాకపోవడంతో నన్ను సౌందర్య డూప్ గా పెట్టి కృష్ణవంశీ గారు సీన్ షూట్ చేసారు. విలన్లు ఆమెను తరిమే సీన్ అలా చేసాం అంటూ చెప్పారు.

ఇక ఆ సినిమా సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి స్నేహితుడు అయ్యాడు. ఇప్పటికీ బాగా క్లోజ్ గా ఉంటుంటాం. ఒక నాలుగేళ్ళ క్రితం వరకు కూడా ఇద్దరం కలిస్తే జోకులేసుకుని నవ్వుకునేవాళ్ళం. ఆ త్రివిక్రమ్ కూడా సినిమాల్లో చెప్తా స్వామి అంటాడు ఇంతవరకు మంచి ఆఫర్ ఇవ్వలేదు. ఏమైనా అంటే టైం రాలేదు అంటాడు. ఇక డైరెక్టర్ పరుశురాం కూడా పిన్ని కొడుకు, నా తమ్ముడే కానీ తన సినిమాల్లో కూడా నేను లేను నాకు అవకాశం ఇవ్వలేదు అంటూ చెప్పారు జోగి నాయుడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago