Jr NTR -Sampoornesh Babu:బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక ఈ కార్యక్రమం తెలుగులో ప్రస్తుతం ఆరవ సీజన్ ప్రసారం అయ్యి బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య ఇప్పటికే గొడవలు, పోట్లాటలు మొదలుపెట్టారని చెప్పాలి.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ఎ ఎన్నో సీజన్లు ప్రసారం అయినప్పటికీ బిగ్ బాస్ సీజన్ వన్ ఎంతో ప్రత్యేకమని చెప్పాలి.
ఇక ఈ సీజన్ ఎందుకంత ప్రత్యేకమైనది అనే విషయానికి వస్తే ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడమే కాకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల పట్ల ఈయన ఎప్పుడు భేదాభిప్రాయాలు చూపించలేదని ఎవరు తప్పు చేసినా మందలించడమే కాకుండా మంచి చేసిన వారిపై ప్రశంసలు కూడా కురిపించారని చెప్పాలి.
ఇకపోతే ఈ సీజన్ లోపాల్గొన్నటువంటి కంటెస్టెంట్ ధనరాజ్ తాజాగా ఈ సీజన్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ వ్యక్తిత్వం పై ప్రశంసల కురిపించారు. అసలు వారం రోజులపాటు హౌస్ లో ఎలా కొట్టుకున్నా వీకెండ్ లో ఎన్టీఆర్ గారిని చూడగానే ఎంతో సంతోషంగా ఉండేదని ఆయన ఎవరికి ఎలా న్యాయం చేయాలో వారికి న్యాయం చేయడమే కాకుండా తప్పు చేస్తున్న వారిని మందలించే విషయంలో కూడా ముందుంటారని ధనరాజ్ చెప్పారు.
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ సంపూర్ణేష్ బాబు కోసం ఏకంగా బిగ్ బాస్ నిర్వాహకులతో ఫైట్ చేశారని ధనరాజ్ వెల్లడించారు. సంపూర్ణేష్ బాబు పెరిగిన వాతావరణం, బిగ్ బాస్ వాతావరణం పూర్తిగా విభిన్నం. అయితే సంపూర్ణేష్ బాబు హౌస్ లోకి వచ్చిన కొద్ది రోజులకే సిక్ అయ్యారు. ఆ కార్యక్రమం నుంచి తను బయటకు వెళ్లాలంటే 25 లక్షలు కట్టి వెళ్లాలి.ఈ సమయంలో ఎన్టీఆర్ సంపూర్ణేష్ బాబు కోసం ఫైట్ చేస్తూ నేను హోస్ట్ చేస్తున్న పస్ట్ షోలో అలా చేయకండి అని చెప్పడమే కాకుండా మరి డబ్బు కట్టాల్సి వస్తే ఆ 25 లక్షలు నేనే కడతా అంటూ సంపూర్ణేష్ బాబు కోసం ఎన్టీఆర్ ఫైట్ చేశారని ఈ సందర్భంగా ధన్ రాజు బయటపెట్టారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…