Jyothi Reddy: జూనియర్ ఆర్టిస్ట్ జోతిరెడ్డి మృతి..! అనుకోకుండా నిద్రమత్తులో..!
Jyothi Reddy: సినీ పరిశ్రమల్లో రాణిద్దామనకుంది… కానీ అనుహ్యంగా రైలు ప్రమాదంలో మరణించింది. అనుకోని ఘటన, నిద్రమత్తు నుంచి తేలుకోకపోవడంతో జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి(26) మరణించింది. వివరాల్లోకి వెళితే… సొంతూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న జ్యోతి రెడ్డి రైలు ప్రమాదంలో మరణించింది.
షాద్ నగర్ స్టేషన్ లో రైలు దిగి ఎక్కుతుండగా.. జ్యోతి ఫ్లాట్ ఫామ్ పై పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో మరణించింది. జ్యోతి రెడ్డి ఓవైపు జూనియర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే.. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగిగానూ ఆమె విధులు నిర్వర్తిస్తోంది.
సంక్రాంతి పండగ సందర్భంగా.. ఇటీవల సొంతూరు ఏపీలోని కడప జిల్లా చిట్వేన్ మండలం సిగమాల వీధికి వెళ్లింది. పండగను ముగించుకుని సోమవారం రాత్రి తిరుగు పయనమైంది. చిత్తూర్ నుంచి కాచిగూడ వెళ్లే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో తిరుగు ప్రయాణం అయింది. రైల్వేకోడూర్ లో ఎక్కి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయింది.
అయితే తెల్లవారుజామున 5.30 గంటలకు షాద్ నగర్ రైల్వే స్టేషన్ లో దిగింది. అయితే కాచిగూడ అనుకుని షాద్ నగర్ లో దిగడం.. ఆ తరువాత కాచిగూడ కాదని తెలుసుకుని కదులుతున్న రైలులో ఎక్కే ప్రయత్నం చేసింది. దీంతో రైలు ఎక్కలేక, అప్పటికే నిద్రమత్తులో ఉండటంతో ఫ్లాట్ ఫామ్ మీద పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో గాయపడింది. రైల్వే పోలీసులు చికిత్స నిమిత్తం జ్యోతి రెడ్డిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే జ్యోతిరెడ్డి మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మృతి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్ది.. కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమె మృతదేహాన్ని పోస్టుఆహెమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలిస్తుండగా బంధువులు అభ్యంతరం చెబుతూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…