Dhanush - Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా.. రజనీ ప్రయత్నాలు ఫలించలేదా?
Dhanush – Aishwarya Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య దంపతులు సోమవారం రాత్రి ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.18 సంవత్సరాల వైవాహిక జీవితంలో కలహాలు లేకుండా ఎంతో సంతోషంగా గడిపిన ఈ జంట విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అని పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇద్దరు విడిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… ఐశ్వర్య కేవలం దర్శకురాలిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని ఈమె ఒక పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించాలని భావించగా అందుకు ధనుష్ ఒప్పుకోలేదని సమాచారం. అదేవిధంగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా చిత్రాన్ని ధనుష్ నిర్మించారు. ఈ సినిమా భారీ నష్టాలను ఎదుర్కొంది ఈ విషయమై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
అదేవిధంగా ఈ మధ్యకాలంలో హీరో ధనుష్ మరొక హీరోయిన్ తో చాలా చనువుగా ఉంటున్నారనే విషయం కూడా వినపడుతుంది.ఇలా వారి మధ్యలోకి మరొక హీరోయిన్ రావడంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఐశ్వర్య ధనుష్ విడాకులు ఇవ్వాలని భావించినట్లు సమాచారం.
ఇలా వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో రజనీకాంత్ ఆ సమస్యను పరిష్కరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా రజనీకాంత్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో రజినీకాంత్ చివరికి వారి నిర్ణయాన్ని వారికే వదిలేశారు.దీంతో వీరిద్దరు కలిసి ఉండటం కన్నా విడిపోవడమే మంచిదని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పెద్దఎత్తున ఫిలింనగర్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.మరి వీరు విడాకులకు అసలు కారణం ఇదేనా మరేదైనా ఉందా అనే విషయం స్వయంగా ధనుష్ ఐశ్వర్య ప్రకటిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…