Dhanush - Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా.. రజనీ ప్రయత్నాలు ఫలించలేదా?
Dhanush – Aishwarya Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య దంపతులు సోమవారం రాత్రి ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.18 సంవత్సరాల వైవాహిక జీవితంలో కలహాలు లేకుండా ఎంతో సంతోషంగా గడిపిన ఈ జంట విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అని పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇద్దరు విడిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… ఐశ్వర్య కేవలం దర్శకురాలిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని ఈమె ఒక పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించాలని భావించగా అందుకు ధనుష్ ఒప్పుకోలేదని సమాచారం. అదేవిధంగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా చిత్రాన్ని ధనుష్ నిర్మించారు. ఈ సినిమా భారీ నష్టాలను ఎదుర్కొంది ఈ విషయమై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
అదేవిధంగా ఈ మధ్యకాలంలో హీరో ధనుష్ మరొక హీరోయిన్ తో చాలా చనువుగా ఉంటున్నారనే విషయం కూడా వినపడుతుంది.ఇలా వారి మధ్యలోకి మరొక హీరోయిన్ రావడంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఐశ్వర్య ధనుష్ విడాకులు ఇవ్వాలని భావించినట్లు సమాచారం.
ఇలా వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో రజనీకాంత్ ఆ సమస్యను పరిష్కరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా రజనీకాంత్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో రజినీకాంత్ చివరికి వారి నిర్ణయాన్ని వారికే వదిలేశారు.దీంతో వీరిద్దరు కలిసి ఉండటం కన్నా విడిపోవడమే మంచిదని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పెద్దఎత్తున ఫిలింనగర్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.మరి వీరు విడాకులకు అసలు కారణం ఇదేనా మరేదైనా ఉందా అనే విషయం స్వయంగా ధనుష్ ఐశ్వర్య ప్రకటిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…