కొన్ని వింతలు అరుదుగా మాత్రమే చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ వింతలను చూడటం మిస్ అయితే మళ్లీ చూడటం కోసం దశాబ్దాల పాటు, శతాబ్దాల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ నెల 21వ తేదీన ఆకాశంలో ఒక వింత చోటు చేసుకోనుంది. నిపుణులు చెబుతున్న ప్రకారం శని, గురు గ్రహాలు ఒకదానికొకటి సమీపంలోకి చేరుకోనున్నాయి. 1623 సంవత్సరంలో ఇలా జరగగా మళ్లీ 400 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది.
జ్యుపిటర్, శాటర్న్ గ్రహాలు 21వ తేదీన ప్రకాశవంతమైన నక్షత్రంలా కనిపిస్తాయి. బిర్లా ప్లానెటేరియం డైరెక్టర్ దేబి ప్రసాద్ దువారీ అరుదుగా కనిపించే ఈ అద్భుతాన్ని గ్రేట్ కంజంక్షన్ అని పిలుస్తారని పేర్కొన్నారు. ఖగోళ గ్రహాలైన జ్యుపిటర్, శాటర్న్ ఒకదానికొకటి దగ్గరగా సమీపంచడం వల్ల దానిని కంజంక్షన్ పేరుతో పిలుస్తారు. ఎవరైతే ఇప్పుడు ఈ అరుదైన దృశ్యం చూడటం మిస్ అయితే మళ్లీ 2080లో ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి సమీపంగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గురు, శని గ్రహాలు 2080 సంవత్సరం మార్చి 15వ తేదీన మళ్లీ ఒకదానికొకటి సమీపంగా రానున్నాయి. ఇప్పుడు ఊహ తెలిసిన వాళ్లలో 2080 నాటికి జీవించి ఉంటారో లేదో చెప్పడం కష్టం. అందువల్ల వీలైతే ఈ దృశ్యాన్ని చూడటం మంచిది. డిసెంబర్ 15వ తేదీన రెండు ఖగోళ గ్రహాల మద్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుందని ఇంత తక్కువ దూరంలో రెండు గ్రహాలు ఉండటం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
డిసెంబర్ 21వ తేదీన సూర్యుడు అస్తమించిన తరువాత ఈ అరుదైన దృశ్యాన్ని చూడవచ్చు. డిసెంబర్ 21 వరకు ప్రతిరోజూ దూరం క్రమంగా తగ్గి అద్భుతమైన కంజంక్షన్ మన కళ్లకు కనిపిస్తుంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…