సోషల్ మీడియా జమానాలో.. టాలెంట్ ఏ మూలన ఉన్నా.. ప్రపంచానికి ఇట్టే తెలిసిపోతుంది. ఇంతకు ముందు ఎంతో కష్టపడితే కానీ జనాల్లో గుర్తింపు వచ్చేద కాదు.. కానీ ప్రస్తుతం ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోతున్నారు. మంచి గుర్తింపు వస్తుంది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మీద తిరుగులేని గుర్తింపు అందుకుంటున్నారు. పలువురు ఓ రేంజిలో గుర్తింపు అందుకుంటున్నారు. తాజాగా మరో వ్యక్తి బాగా పాపులర్ అయ్యాడు. ఇంతకీ అతని కథేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఈయన పేరు భువన్ బడ్యాకర్. పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తి. చాలా పేద వాడు. బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో వేరు శనగ కాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. రోజుకు 2 నుంచి 3 వందల రూపాయలు సంపాదిస్తున్నాడు. తాజాగా పల్లీలు కొనడానికి వచ్చిన కొందరు వ్యక్తులు ఆయన అద్భుతంగా పాడటం గుర్తించారు. తనకు తానుగా ఓ పాట రాసుకున్నాడు. పల్లీలు అమ్ముకుంటూ ఆ పాట పాడేవారు. జనాలు ఆయన పాటకు ఆకర్షితులు అయ్యేవారు. ఆ పాట వినడం కోసం అయినా.. తన దగ్గర పల్లీలు కొనడానికి వచ్చేవారు.
తాజాగా ఆయన పాట పాడుతుంటే ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు భువన్. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా భువన్ పాట హల్ చల్ చేస్తుంది. నెటిజన్లను ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంది. దేశ విదేశాల్లో ఈ పాట మార్మోగుతుంది. ఇతర దేశ ప్రజలు కూడా ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కు కూడా ఈ పాట ఆసరాగా నిలిచింది.
తాజాగా అతడికి ఓ ఆడియో కంపెనీ మంచి అవకాశాన్ని కలిగించింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ పాటను తనతో పాడించింది. తన కంపెనీ ద్వారా ఆయన పాటను మార్కెట్ లోకి విడుదల చేసింది. రోడ్డు మీద మాసిపోయిన దుస్తులతో ఉన్న అతడికి మంచి వస్త్రాలు కొనిపెట్టింది. ఆయన లుక్ తో పాటు ఆయన ఆర్థిక స్థితిని కూడా మార్చి వేసింది సదరు మ్యూజిక్ కంపెనీ. ఆయన పాటను ర్యాప్ వెర్షన్ లో కూడా రీమేక్ చేశారు. ఈ పాట పాడిన భువన్ ను ఆ కంపెనీ ఫైనాన్షియల్ గా ఆదుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…