Kalyan Ram : ఎన్టీఆర్ మనవడిగా తెలుగు సినిమాకు పరిచయమైన కళ్యాణ్ రామ్, బాబాయ్ బాలకృష్ణ సినిమా ‘బాల గోపాలుడు’ లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఇక మళ్ళీ చాలా ఏళ్ల తరువాత 2003లో ‘తొలి చూపులోనే’ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. ఆ సినిమా అంతగా రాకపోవడంతో సొంత బ్యానర్ పెట్టి నచ్చినట్టు కథలను చేస్తూ వస్తున్నాడు కళ్యాణ్ రామ్. అలా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘అతనోక్కడే’ సినిమాతో హిట్ కొట్టాడు. ఇక ఆ తరువాత 2006 లో పెళ్లి చేసుకున్న కళ్యాణ్ రామ్, పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకున్నాడు. పెద్దలు కుదుర్చిన వివాహమే అయినా పెళ్లిచూపుల్లోనే స్వాతి బాగా నచ్చడం తో తనను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాడట.
సినిమా రంగంలోకి స్వాతి…
మంచి కుటుంబం నుండి వచ్చిన స్వాతి, పెళ్ళికి ముందు డాక్టర్ గా పనిచేసారు. కానీ పెళ్లయ్యాక కుటుంబ భాద్యతల కోసం తన వైద్య వృత్తిని వదిలేసింది. కళ్యాణ్ రామ్, స్వాతి లకు ఇద్దరు పిల్లలు ఒక పాప, ఒక బాబు , తారక అద్వైత, శౌర్య రామ. ఇక పిల్లలు పెద్ద వాళ్ళు అవ్వడం వల్ల స్వాతి ఇపుడు మళ్ళీ ఏదైనా చేయాలని అనుకోని భర్త సహకారంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సొంత విఎఫ్ఎక్స్ సంస్థను స్థాపించారు. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన బింబసార చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
ఏ మాత్రం అంచనాలు లేకున్నా విడుదలయ్యాక మంచి టాక్ తో జనాలను థియేటర్లకు రప్పిస్తోంది. మొదటి సినిమాతోనే వశిష్ఠ మంచి సాలిడ్ హిట్ అందుకుని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత సినిమా చూడడానికి థియేటర్స్ కి అంతగా రాని జనం మళ్ళీ కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాకు రావడం సినిమా ఇండస్ట్రీ కి కూడా శుభపరిణామం. ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్న సమయంలో కళ్యాణ రామ్ బింబిసార ఆదుకుందనే చెప్పాలి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…