Geetha Krishna : టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించిన గీతాకృష్ణ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని ప్రస్తుతం నటీనటుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతాకృష్ణ నటుడు కమల్ హాసన్ గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటివరకు గీతాకృష్ణ విక్రమ్ సినిమా చూడలేదని త్వరలోనే ఈ సినిమా చూస్తానని తెలిపారు. అయితే ఈయన కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం, సాగరసంగమం వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ వ్యక్తిత్వం గురించి గీతాకృష్ణ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా గీత కృష్ణ మాట్లాడుతూ కమల్ హాసన్ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే రెండు లక్షల రూపాయల కెమెరాతో సినిమా చేసి నష్టాల పాలయ్యారు. ఆయన డబ్బు విషయంలో కాస్త కక్కుర్తిగా ఉంటారని గీత కృష్ణ వెల్లడించారు.
కమల్ హాసన్ కి చచ్చు తెలివితేటలు అధికంగా ఉన్నాయి. ఈయన వన్ మ్యాన్ షో లాగా అన్నీ తానే చేసుకుంటే మనకే మంచి పేరు వస్తుందనే అతి తెలివి తేటలు ప్రదర్శిస్తారు.ఇలాంటి విషయాలలో కమల్ హాసన్ చాలా ఇంటిలిజెంట్ అంటూ ఆయన గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక తాజాగా విడుదలైన విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తో పాటు మరొక నటుడు విజయ్ సేతుపతి సూర్య కూడా ఉన్నారు. కానీ ఈ వీరిద్దరిని ప్రమోషన్ లో ఎక్కడ కూడా కమల్ హాసన్ ఉపయోగించుకోలేదు.
ఇక మీరు ప్రస్తావన కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో తీసుకురాలేదు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు వీరిని హైలెట్ చేశారని, ప్రతి ప్రమోషన్ కార్యక్రమాలలోనూ కమల్ హాసన్ తనని తాను హైలెట్ చేసుకున్నారని గీతాకృష్ణ తెలిపారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల గురించి కూడా ఈయన షాకింగ్ కామెంట్ చేశారు.ఈ సినిమా కోసం అన్ని ముందుగా అరేంజ్ చేసుకుని సొంతంగా విడుదల చేశారు కనుక కలెక్షన్లు కూడా వచ్చి ఉంటాయని తెలిపారు.ఇకపోతే డైరెక్టర్లకు హీరో సూర్యకు అసిస్టెంట్ డైరెక్టర్లకు కానుకగా ఇచ్చారు ఇలా ఇది వరకు ఎప్పుడైనా కమల్ హాసన్ చిత్ర బృందానికి కానుకలు ఇచ్చారా అని ప్రశ్నించగా ఇస్తే తీసుకుంటారు కానీ ఆయన ఎప్పుడూ ఇవ్వలేదంటూ గీతాకృష్ణ వెల్లడించారు.
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…