Karisma Kapoor's ex-husband Sanjay Kapoor dies suddenly! While playing polo..
Sanjay Kapoor : ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ (53) ఇక లేరు. ఆయన పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. ఈ వార్త సినీ, వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
అసలేం జరిగిందంటే..
సంజయ్ కపూర్ ఇంగ్లాండ్లోని గార్డ్స్ పోలో క్లబ్లో పోలో ఆడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆడుతున్న సమయంలో ఆయన పొరపాటున ఒక తేనెటీగను మింగారు. దీనివల్ల ఒక్కసారిగా అలెర్జీ రియాక్షన్ వచ్చి, ఊపిరాడక గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
సంజయ్ కపూర్ గురించి కొన్ని విషయాలు
సంజయ్ కపూర్ భారత ఆటోమోటివ్ రంగంలో ఒక దిగ్గజం. ఆయన సోనా కామ్స్టార్ సంస్థకు ఛైర్మన్గా ఉంటూ, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన విడిభాగాల తయారీలో కంపెనీని అగ్రస్థానానికి చేర్చారు. అంతేకాదు, ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ACMA) అధ్యక్షుడిగా కూడా ఆయన పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
వ్యాపారంతో పాటు, సంజయ్కి పోలో అంటే చాలా ఇష్టం. ఆయన ఆరియస్ పేరుతో సొంతంగా పోలో జట్టును కూడా నడిపారు.
చివరిగా ఆయన ఏం చెప్పారంటే..
సంజయ్ కపూర్ మరణించడానికి కొన్ని గంటల ముందు అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. “అహ్మదాబాద్ విమాన ప్రమాద వార్త నన్ను కలిచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని ఆయన పోస్ట్ చేశారు.
సంజయ్ కపూర్ గతంలో కరిష్మా కపూర్ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ప్రియా సచ్దేవ్ను పెళ్లి చేసుకున్నారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…