Featured

ఆత్మహత్యకు పాల్పడిన మోనిత.. బయటపడిన అసలు నిజం!

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ జూలై 17 న 1094 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.గత ఎపిసోడ్లో ఆనందరావు తన పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న కార్తీక్ కు మోనిత ఫోన్ చేసి ఈ వీడియో చూడు మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెబుతోంది. దాంతో ఈ వీడియో చూసిన కార్తీక్ భోజనం చేయకుండా.. చేతులు కడిగి, దీప పిలుస్తున్నా వినిపించుకోకుండా కారు తీసుకొని సరాసరి మోనిత ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళే సరికి బెడ్ మీద పడి ఉంటుంది మోనిత. ఆ సమయంలోనే డాక్టర్ భారతి మోనితకి ఇంజక్షన్ వేస్తుంది.

మంచం కింద ప్రియమణి కూర్చుని “మా అమ్మగారిని పట్టించుకునే వారు ఎవరూ లేరమ్మా”.. మా అమ్మగారిని ఎవరు అర్థం చేసుకోవడం లేదూ.. అంటూ ఏడవడంతో ప్రియమణి ఆపు అంటూ భారతి అంటుంది.కార్తీక్ ని చూసిన భారతి టైం కి ప్రియమణి చూడకపోతే ప్రాణాలు పోయేవి కార్తీక్.. ఇంతవరకు ఎందుకు తెచ్చుకున్నావ్… ఇప్పుడిప్పుడే నువ్వు దీప కలుసుకుంటున్నారు మరి ఇదంతా ఏంటి అని అంటుంది.అదే సమయంలోనే ప్రియమణి ఈ మత్తులోనే మా అమ్మగారికి కడుపు తీసేయండి అమ్మ దాని వల్లే కదా ఈ సమస్యలన్నీ అనగా.. ఆ పని చేయండి అంటూ రోషిని ఎంట్రీ ఇస్తుంది.
రోషిని చూడగానే కార్తీక్ తలదించుకున్నాడు.

మోనిత కి ట్రీట్మెంట్ ఇచ్చి భారతి వెళ్ళిపోతుంది. ఎసిపి రోషిని కార్తీక్ తో మాట్లాడాలి బయటికి రమ్మని పిలుస్తుంది. వెళ్ళగానే ఎందుకు చేసావ్ ఈ పని? రాయల్ ఫ్యామిలీకి చెందిన నీకు హద్దులు, హక్కులు తెలుసు.మీరు మోనితని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం నిజమేనా? మనసు పడి కాదు.. అంటాడు కార్తీక్. ‘మరి ఏం పడి? మోజు పడా? అని రోషిని అడిగింది. దీంతో కార్తీక్ నాకు దీపకు ఉన్న మనస్పర్థలు మీకు తెలుసు. మా మమ్మీ మా ఇద్దరినీ కలపాలని చూస్తుంది.మోనితని పెళ్లి చేసుకుంటే మా మమ్మీ బలవంతం పెట్టద్దనే ఉద్దేశంతోనే తప్ప మేమిద్దరం మంచి స్నేహితులం ఈ తప్పు మాత్రం… అని కార్తీక్ అంటుండగా.. మీకు తెలియకుండానే జరిగింది.. అవునా అంటుంది రోషిణి.

మోనిత చెప్పే వరకు ఈ విషయం జరిగిందనేది నాకు అసలు తెలియదు. అనే కార్తీక్ చెప్పగా..మీరు ఎన్ని చెప్పినా ఫలితం భరించకతప్పుదు కార్తీక్ అంటుంది రోషిణి. ఈ మాట విన్న మోనిత నాకు కూడా ఇదే కదా కావాల్సింది అని మనసులో అనుకుంటూ. ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్తున్న కార్తీక్.. జరిగిన విషయం మొత్తం గుర్తు చేసుకుంటాడు. ప్రియమణి ఫోన్ చేయక పోతే ప్రాణాలు కోల్పోయిందని భారతీ చెప్పగా.. అదే సమయానికి రోషిని అక్కడికి వచ్చి ప్రియమణి చెప్పకపోతే ఈ విషయం నాకు తెలిసేది కాదని రోషిని అన్న మాటలు గుర్తుకు తెచ్చుకున్న కార్తీక్ ఇదంతా నాటకం.. ప్లాన్ ప్రకారమే ఇలా చేస్తుందనే నిజం తెలుసుకుంటాడు. మమ్మీ దీప, మోనిత గురించి చెప్పినప్పుడే జాగ్రత్తపడి ఉండాల్సింది అంటూ మనసులోనే మధన పడతాడు. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందో మరో ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

6 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

7 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

14 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

15 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

15 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago