Connect with us

Featured

ఆత్మహత్యకు పాల్పడిన మోనిత.. బయటపడిన అసలు నిజం!

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ జూలై 17 న 1094 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.గత ఎపిసోడ్లో ఆనందరావు తన పిల్లలతో

Published

on

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ జూలై 17 న 1094 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.గత ఎపిసోడ్లో ఆనందరావు తన పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న కార్తీక్ కు మోనిత ఫోన్ చేసి ఈ వీడియో చూడు మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెబుతోంది. దాంతో ఈ వీడియో చూసిన కార్తీక్ భోజనం చేయకుండా.. చేతులు కడిగి, దీప పిలుస్తున్నా వినిపించుకోకుండా కారు తీసుకొని సరాసరి మోనిత ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళే సరికి బెడ్ మీద పడి ఉంటుంది మోనిత. ఆ సమయంలోనే డాక్టర్ భారతి మోనితకి ఇంజక్షన్ వేస్తుంది.

మంచం కింద ప్రియమణి కూర్చుని “మా అమ్మగారిని పట్టించుకునే వారు ఎవరూ లేరమ్మా”.. మా అమ్మగారిని ఎవరు అర్థం చేసుకోవడం లేదూ.. అంటూ ఏడవడంతో ప్రియమణి ఆపు అంటూ భారతి అంటుంది.కార్తీక్ ని చూసిన భారతి టైం కి ప్రియమణి చూడకపోతే ప్రాణాలు పోయేవి కార్తీక్.. ఇంతవరకు ఎందుకు తెచ్చుకున్నావ్… ఇప్పుడిప్పుడే నువ్వు దీప కలుసుకుంటున్నారు మరి ఇదంతా ఏంటి అని అంటుంది.అదే సమయంలోనే ప్రియమణి ఈ మత్తులోనే మా అమ్మగారికి కడుపు తీసేయండి అమ్మ దాని వల్లే కదా ఈ సమస్యలన్నీ అనగా.. ఆ పని చేయండి అంటూ రోషిని ఎంట్రీ ఇస్తుంది.
రోషిని చూడగానే కార్తీక్ తలదించుకున్నాడు.

మోనిత కి ట్రీట్మెంట్ ఇచ్చి భారతి వెళ్ళిపోతుంది. ఎసిపి రోషిని కార్తీక్ తో మాట్లాడాలి బయటికి రమ్మని పిలుస్తుంది. వెళ్ళగానే ఎందుకు చేసావ్ ఈ పని? రాయల్ ఫ్యామిలీకి చెందిన నీకు హద్దులు, హక్కులు తెలుసు.మీరు మోనితని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం నిజమేనా? మనసు పడి కాదు.. అంటాడు కార్తీక్. ‘మరి ఏం పడి? మోజు పడా? అని రోషిని అడిగింది. దీంతో కార్తీక్ నాకు దీపకు ఉన్న మనస్పర్థలు మీకు తెలుసు. మా మమ్మీ మా ఇద్దరినీ కలపాలని చూస్తుంది.మోనితని పెళ్లి చేసుకుంటే మా మమ్మీ బలవంతం పెట్టద్దనే ఉద్దేశంతోనే తప్ప మేమిద్దరం మంచి స్నేహితులం ఈ తప్పు మాత్రం… అని కార్తీక్ అంటుండగా.. మీకు తెలియకుండానే జరిగింది.. అవునా అంటుంది రోషిణి.

Advertisement

మోనిత చెప్పే వరకు ఈ విషయం జరిగిందనేది నాకు అసలు తెలియదు. అనే కార్తీక్ చెప్పగా..మీరు ఎన్ని చెప్పినా ఫలితం భరించకతప్పుదు కార్తీక్ అంటుంది రోషిణి. ఈ మాట విన్న మోనిత నాకు కూడా ఇదే కదా కావాల్సింది అని మనసులో అనుకుంటూ. ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్తున్న కార్తీక్.. జరిగిన విషయం మొత్తం గుర్తు చేసుకుంటాడు. ప్రియమణి ఫోన్ చేయక పోతే ప్రాణాలు కోల్పోయిందని భారతీ చెప్పగా.. అదే సమయానికి రోషిని అక్కడికి వచ్చి ప్రియమణి చెప్పకపోతే ఈ విషయం నాకు తెలిసేది కాదని రోషిని అన్న మాటలు గుర్తుకు తెచ్చుకున్న కార్తీక్ ఇదంతా నాటకం.. ప్లాన్ ప్రకారమే ఇలా చేస్తుందనే నిజం తెలుసుకుంటాడు. మమ్మీ దీప, మోనిత గురించి చెప్పినప్పుడే జాగ్రత్తపడి ఉండాల్సింది అంటూ మనసులోనే మధన పడతాడు. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందో మరో ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.

Advertisement

Featured

Pitapuram: అందరి ఆసక్తి పిఠాపురం పైనే.. గెలుపు ఎవరిది.. సర్వేలు ఏం చెబుతున్నాయి?

Published

on

Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎన్నికల హడావిడి మొదలైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరి జెండా ఎగురుతుందన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా పిఠాపురం పైన ఇంత ఆసక్తి రావడానికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే కారణమని చెప్పాలి.

గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈయనకు పోటీగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఎన్నో చానల్స్ వారు ప్రజా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఈమె కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగా గీత కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.

Advertisement

జనసేనదే విజయమా..
ఇకపోతే వంగా గీత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పిఠాపురానికి చేయాల్సినటువంటి న్యాయం చేయలేకపోయారని అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామంటూ చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి చూడాలి మరి పిఠాపురంలో ఏ జెండా ఎగురుతుంది వంగా గీత పవన్ కళ్యాణ్ కి ఎలా పోటీగా నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

AP politics: పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Published

on

AP politics: రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాలని ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు.

ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీల కోసం ఎంతో కష్టపడినటువంటి వారికి సీట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ కూడా అభ్యర్థులు అలకలు మొదలుపెట్టారు. ఇటీవల బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు.

ఇలా బిజెపికి సేటు కేటాయించడంతో మహేష్ ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు రెండు గంటల పాటు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈయనని పవన్ కళ్యాణ్ పిలిపించుకొని తనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి తప్పకుండా ఇస్తామని చెప్పిన మహేష్ మాత్రం తనకు టికెట్ కావాలని కోరారు.

Advertisement

పొత్తు ధర్మాన్ని పాటించండి..
ఇలా అభ్యర్థులు సహకరించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: షర్మిల సునీతపై జగన్ ఘాటు వ్యాఖ్యలు.. హంతకులకే మద్దతంటూ?

Published

on

AP Politics: ఏపీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సభలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో రాష్ట్ర తెలుసనీ, తన చెల్లెలు షర్మిల సునీతను కూడా తమ రాజకీయాలలో పావులుగా వాడుకున్నారని తెలిపారు.

నా చెల్లెమ్మలు ఇద్దరూ కూడా హంతకులకే మద్దతు తెలుపుతున్నారని జగన్ మండిపడ్డారు. చెల్లెమ్మలు చిన్నాన్నను చంపిన వారితో చేతులు కలపగా నేను మాత్రం ప్రజల పక్షమే ఉంటానని జగన్ తెలిపారు. ఇలాంటి హంతకులతో అవినీతిపరులతో యుద్ధం చేయడానికి ఈ అర్జునుడు సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ఈ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

Advertisement

కూటమి అంటే కుట్రలు..
వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపి, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారని అన్నారు. కూటమి అంటే కుట్రలు కుతంత్రాలని జగన్ తెలిపారు. తమ జెండా మాత్రం మరో జెండాతో జతకట్టలేదని చెప్పారు. కేంద్రం నుంచి ఓ పార్టీని తెచ్చుకున్నారని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న డ్రగ్స్‌ కేసు వెనుక చంద్రబాబు వదిన గారి చుట్టం ఉన్నారంటూ డ్రగ్స్ వ్యవహారంపై కూడా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!