Featured

కిడ్నీని అమ్ముతానంటూ పేపర్ లో యాడ్ ఇచ్చిన యువకుడు.. చివరకు..?

కరోనా మహమ్మారి విజృంభణ దేశంలోని వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ రంగం ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలకు చెందిన వ్యాపారులు లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయారు . చాలామంది వ్యాపారులకు లాక్ డౌన్ వల్ల లక్షల్లో నష్టం వాటిల్లింది. దీంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక చాలామంది వ్యాపారులు ఉన్న ఆస్తులను అమ్మేసుకుంటున్నారు. కేంద్రం మారటోరియం ప్రయోజనాలను కల్పించినా వాటి వల్ల లాభం పొందిన వారి సంఖ్య చాలా తక్కువ.

చేసిన అప్పులు తీరకపోవడంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో శరీరంలోని అవయవాలను అమ్మేయాలని చూస్తున్నారు. తాజాగా కశ్మీర్ కు చెందిన వ్యాపారి ఏకంగా తన కిడ్నీలను అమ్మాలనుకుంటున్నానని పేపర్ లో యాడ్ ఇచ్చాడు. 91 లక్షల రూపాయలు అప్పు చేసిన వ్యాపారికి అప్పును ఏ విధంగా తీర్చాలో అర్థం కాలేదు. కిడ్నీ అవసరం ఉన్నవారు తనను సంప్రదించమని అతను పేపర్ లో యాడ్ ఇచ్చాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే కశ్మీర్ లోని కుల్గమ్‌ జిల్లాకు చెందిన సబ్జర్ అహ్మద్ ఖాన్ కారు డీలర్ గా పని చేసేవాడు. లాక్ డౌన్ వల్ల వ్యాపారంలో అప్పటివరకు సంపాదించిన డబ్బు మొత్తం అహ్మద్ కోల్పోయాడు. ఆర్టికల్ 370 సమయంలో లాక్ డౌన్ అమలు వల్ల నష్టపోయిన వ్యాపారి కరోనా వల్ల మరింత నష్టపోయాడు. అయితే పేపర్ యాడ్ వైరల్ కావడంతో పోలీసులు వ్యాపారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారని తెలుస్తోంది.

మన దేశ చట్టాల ప్రకారం అవయవాలను విక్రయించడం నేరం కావడంతో పోలీసులు వ్యాపారిని సున్నితంగా హెచ్చరించారని దీంతో సదరు వ్యాపారి కిడ్నీ అమ్మాలనే ఆలోచనను విరమించుకున్నాడని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఇలా కూర్చుంటే రక్తపోటు పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్!

ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…

7 minutes ago

దేవుడికి నమస్కారం చేస్తే ఎందుకు కళ్లు మూసుకుంటాం? అసలు కారణం ఇదే!

దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…

37 minutes ago

తెలంగాణలో ఎవరి జనాభా ఎక్కువ?.. కుటుంబ సర్వేలో బిగ్ రివీల్

తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…

58 minutes ago

అమావాస్య వెనుక ఉన్న పురాణ కథ తెలుసుకుంటే ఆశ్చర్యమే!

ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…

1 hour ago

అంతర్జాతీయ విజయాల కోసం తిరుమల చేరుకున్న పీవీ సింధు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…

2 hours ago

ఎవరీ నటాలీ బేకర్?.. అమెరికా-ఇరాన్ చర్చలతో ట్రెండ్‌లోకి

ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…

2 hours ago