Keerthi Bhatt: బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కీర్తి భట్ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్నారు ఇలా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమె ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఈమె తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో విషాదం నింపుకొని ఉందనే విషయం మనకు తెలిసిందే.
రోడ్డు ప్రమాదంలో తన కుటుంబ సభ్యులందరూ చనిపోయి ఈమె ఒక్కటే మిగిలిన విషయాన్ని బిగ్ బాస్ కార్యక్రమంలో తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఇలా తన ఫ్యామిలీలో ఒక్కతినే మిగలటం తనకు ఎవరూ లేకపోవడం తనని ఎంతగానో కృంగదీసింది అయితే తాజాగా ఈమె కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది.
హీరో విజయ కార్తీక్ తోట నటి కీర్తిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమైన బోనాల జాతర కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ ఉంగరాలు మార్చుకొని నిశ్చితార్థం జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఈమె మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
నేను నీకు తోడుగా ఉంటాను… నీకు నేను సపోర్ట్ గా ఉంటా… మీ పేరెంట్స్ ను నా పేరెంట్స్ అనుకుంటా.. కానీ నన్ను వదలకుండా చూసుకో అంటూ ఎమోషనల్ అయ్యారు.అనంతరం వేదికపై ఉన్నటువంటి తన అత్తమామల గురించి కూడా మాట్లాడుతూ ప్రమాదంలో నేను తల్లిని అయ్యే యోగం కోల్పోయాను తన వంశాన్ని ముందుకు తీసుకువెళ్లలేదని చెప్పడంతో తన తల్లిదండ్రులు నీకు మరొక పాప ఎందుకు నువ్వే మాకు పాపవు అవసరమైతే ఒక చిన్నారిని దత్తత తీసుకుందామని తనకు చెప్పారని చెబుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఇలా ఈమె పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలియడంతో ఇకపై తన జీవితం చాలా సంతోషంగా ఉండాలని అందరూ భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…