Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి కానీ ఈ వార్తలలో నిజం లేదని పలు సందర్భాలలో కీర్తి సురేష్ తో పాటు ఆమె తండ్రి కూడా ఈ వార్తలను ఖండించారు. ఇకపోతే కొద్ది రోజులుగా ఆంటోని తట్టిల్ అని దుబాయ్ కి చెందిన ఒక వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి జరగబోతుందని వార్తలు వినిపించాయి.
ఇక ఈ వార్తలపై కీర్తి సురేష్ తండ్రి స్పందించారు తన కుమార్తె వివాహం అంటోనితో జరగబోతుందని వీళ్లిద్దరికి దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని తెలిపారు. ఇక వీరి వివాహం గోవాలోనే ఒక రిసార్ట్ లో డిసెంబర్ 11 ,12 వ తేదీ జరగబోతుందని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇకపోతే తాజాగా కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఈమె తన అత్తారింటికి ఎంత మొత్తంలో కట్న కానుకలు తీసుకెళ్తుందనే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఓ గొప్ప ఇంటికి కోడలుగా వెళ్తున్నటువంటి కీర్తి సురేష్ కట్న కానుకలను కూడా వారి రేంజ్ కి అనుగుణంగానే తీసుకువెళ్తారని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే ఈమె అత్తారింటికి కట్న కానుకగా కొన్ని కోట్ల రూపాయలనే తీసుకుపోతున్నారని చెప్పాలి.
ఆంటోనీ కుటుంబం వారికి కట్నం కావాలి అంటూ ఒక రూపాయి కూడా అడగలేదట. కానీ కీర్తి సురేష్ తల్లిదండ్రులు మాత్రం ఇప్పటివరకు ఆమే సినిమాలలో సంపాదించిన ఆస్తితో పాటు తల్లిదండ్రులుగా వారి కూతురికి వారు ఇవ్వాల్సిన కానుకలను కూడా కీర్తి సురేష్ కి ఇచ్చి పంపిస్తున్నారని అలాగే తమ ఆస్తిలో సగం వాటా కూడా కీర్తి సురేష్ కి రాసి ఇస్తున్నారని తెలుస్తోంది ఇలా ఈ ఆస్తులు విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…