ఓ వ్యక్తి తన ప్రేయసిని 10 ఏళ్ల పాటు నిర్భందించిన ఘటన కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో మలో కీలక విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రెహమాన్, సజిత ఇద్దరు ప్రేమికులు. 2010 సంవత్సరంలో సజిత పెళ్లి చేసుకోవాలనే కారణంతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తర్వాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు.
అప్పుడు ఆమె వయస్సు 18 ఏళ్లు. తర్వాత ఇంట్లో వాళ్లు కూడా ఆమెను వెతకడం మానేశారు. రెహమాన్ పెయింటింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగించాడు. సజితను అతడు ఎవరికీ తెలియకుండా తన ఇంట్లోనే పది సంవత్సరాలు బంధించాడు. బయట ప్రపంచానికి ఎవరికీ తెలియకుండా ఒక గదిలో ఉంచాడు. అయితే తాజాగా వాళ్లిద్దరు వితనస్సేరీలోని ఒక చిన్న ఇంటికి మారారు. అతడి కుటుంబసభ్యులు రెహమాన్ కనిపించడంత లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల దర్యాప్తులో అతడి విషయాలు ఏమి లభ్యం కాలేదు. అయితే ఓ నెన్మారా ప్రాంతంలో అతడి ఆచూకీ కనుకున్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సజితను 10 ఏళ్లు బంధించిన మాట వాస్తవమే.. కానీ ఆమె ఇష్టంతోనే ఇలా చేశానని.. ప్రేమించుకున్న తాము పెళ్లిచేసుకోవాలని అనుకున్నామన్నారు.
ఆమెతో సహజీవనం చేసినట్లు చెప్పాడు. దీంతో ఆమెను పిలిచి పోలీసులు అడగ్గా.. అతడంటే ఇష్టమని చెప్పడంతో కేసు కొట్టేశారు పోలీసులు. తర్వాత వాళ్లిద్దరు అక్కడే రిజిస్టార్ ఆఫీస్ కు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను పురగోమన కళా సాహిత్య సంఘం కొల్లంకోడు సమితి చేసింది. ఇక తాము సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు.. అతడు మీడియాతో చెప్పాడు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…