సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నిందితుడు రాజు కోసం గత వారం రోజులుగా పోలీసులు గాలించగా.. రైలు పట్టాలపై అతడి శవం కనిపించిన విషయం తెలిసిందే. అతడి చెయ్యిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉండటంతో అతడే రాజు అంటూ పోలీసులు నిర్ధారించారు. అయితే రాజును పోలీసులే హత్య చేశారని రాజు కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు.
వాళ్లే అతడిని చంపేసి.. ఎవరికీ అనుమానం రాకుండా ఘట్ కేసర్ వద్ద రైలు పట్టాలపై పడేసినట్లు చెబుతున్నారు. అయితే.. రాజు తప్పుచేసి ఉండొచ్చు. కానీ అతడిని అరెస్టుచేసి .. నిజాలు నిర్ధారణ అయిన తర్వాత శిక్షలు విధించాల్సింది. అలా కాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇలా చంపేసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కథ అల్లడం సరైంది కాదంటూ అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
రాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటూ వాళ్లు తెలిపారు. రాజు చిన్నారిని రేప్ చేశాడంటే తాము అస్సలు నమ్మే వాళ్లం కాదని.. కానీ ఇంట్లో ఆ చిన్నారి శవం కనిపించడంతో నమ్మాల్సి వచ్చిందని అన్నారు. ఇది ముమ్మాటికి పోలీసులే అతడిని హత్య చేసి ఉంటారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియా సైట్లు యూజ్ చేయకపోవడం వల్ల కనుక్కొవడం అతడి ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారింది. నిందితుడిని పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయి రాజు కోసం గాలించాయి.
కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు కీలక ప్రకటన కూడా చేశారు. రాజును పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రాజును ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్ పెరిగింది. మంత్రి మల్లారెడ్డి కూడా రాజును ఎన్ కౌంటర్ చేస్తామని తెలిపారు. వీటిని అన్నింటిని దృష్టిలో ఉంచుకొని రాజును ఎన్ కౌంటర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అతడి బంధువులు వాదిస్తున్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…