Kiara advani gives birth to a healthy baby girl
బాలీవుడ్లోని ప్రముఖ జంట సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ తల్లిదండ్రులయ్యారు. కియారా తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ జంటకు ఇది తొలి సంతానం కావడం విశేషం. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు అని సమీప వర్గాలు వెల్లడించాయి. ఈ శుభవార్తతో సిద్ధార్థ్, కియారా కుటుంబాల్లో ఆనందం అలలెత్తుతోంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.
ఇప్పటికీ ఈ జంట తమ సంతోషాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇప్పటికే ఫిబ్రవరి 28న తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పుడు ఆ శుభముహూర్తం నెరవేరింది.
హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో డెలివరీ :
డెలివరీ కోసం కియారాను ముంబై గిర్గావ్లోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె బిడ్డకు జన్మనిచ్చారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, సిద్ధార్థ్ – కియారా జంట 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ జంట తమ వ్యక్తిగత జీవితం గురించి చాలా ప్రైవేటుగా ఉండడమే కాక, ఇప్పుడు తమ ఆనందాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…