Kiccha Sudeep: వివాదాలలో రష్మిక… టమాటాలు రాళ్లు విసురుతారంటూ కామెంట్ చేసిన హీరో సుదీప్!

Kiccha Sudeep: గత ఆరు సంవత్సరాల క్రితం కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి రష్మిక మందన్న. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయారు.ఇక సెలబ్రిటీలు అన్న తర్వాత వారికి ఎలాంటి స్టార్డం ఉంటుందో అదే స్థాయిలో వారిని ట్రోల్ చేసే వారు కూడా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే రష్మిక సైతం ప్రస్తుతం ఇలాంటి ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది. రష్మిక కన్నడ దర్శకుడు హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా చూసే సమయం తనకు లేదని చెప్పిన సమాధానమే ఇలాంటి వివాదాలకు కారణమైందని చెప్పాలి.కాంతార సినిమా ఇంకా తాను చూడలేదని చెప్పడంతో నీకు లైఫ్ ఇచ్చిన హీరో సినిమా దేశవ్యాప్తంగా చూస్తూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తుంటే నీకు తన సినిమా చూసే అవకాశం లేదా అంటూ నేటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు.

ఇలా ఈ విషయం ద్వారా వివాదాలను ఎదుర్కొంటున్న రష్మిక గురించి తాజాగా మరొక కన్నడ హీరో సుదీప్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెలబ్రిటీలన్న తర్వాత వారి గురించి ట్రోలింగ్స్ రావడం సర్వసాధారణం.సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి చిన్న విషయం కూడా అందరికీ తెలిసిపోతుంది అయితే గతంలో కేవలం ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే తెలుసుకునేవారు.

Kiccha Sudeep: సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఇవన్నీ మామూలే…

అంతకుముందు కేవలం వార్తాపత్రికల ద్వారా మాత్రమే సెలబ్రిటీల గురించి తెలుసుకునేవారు.అయితే ప్రస్తుతం ప్రతి ఒక్క విషయం కూడా అభిమానులకు తెలిసిపోతుంది. అయితే వాళ్లు ఎలాంటి వార్తలు రాసిన మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకోవాలి కానీ అక్కడే ఆగిపోకూడదు. ఒక్కసారి సెలబ్రిటీ స్టేటస్ వచ్చిందంటే నీకు పూలమాలలు వేసి సత్కరిస్తారు. అదే చేతితో టమోటాలు రాళ్లు కూడా వేస్తారంటూ ఈయన తెలియజేశారు.