Kiccha Sudeep: గత ఆరు సంవత్సరాల క్రితం కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి రష్మిక మందన్న. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయారు.ఇక సెలబ్రిటీలు అన్న తర్వాత వారికి ఎలాంటి స్టార్డం ఉంటుందో అదే స్థాయిలో వారిని ట్రోల్ చేసే వారు కూడా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే రష్మిక సైతం ప్రస్తుతం ఇలాంటి ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది. రష్మిక కన్నడ దర్శకుడు హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా చూసే సమయం తనకు లేదని చెప్పిన సమాధానమే ఇలాంటి వివాదాలకు కారణమైందని చెప్పాలి.కాంతార సినిమా ఇంకా తాను చూడలేదని చెప్పడంతో నీకు లైఫ్ ఇచ్చిన హీరో సినిమా దేశవ్యాప్తంగా చూస్తూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తుంటే నీకు తన సినిమా చూసే అవకాశం లేదా అంటూ నేటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు.
ఇలా ఈ విషయం ద్వారా వివాదాలను ఎదుర్కొంటున్న రష్మిక గురించి తాజాగా మరొక కన్నడ హీరో సుదీప్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెలబ్రిటీలన్న తర్వాత వారి గురించి ట్రోలింగ్స్ రావడం సర్వసాధారణం.సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి చిన్న విషయం కూడా అందరికీ తెలిసిపోతుంది అయితే గతంలో కేవలం ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే తెలుసుకునేవారు.
అంతకుముందు కేవలం వార్తాపత్రికల ద్వారా మాత్రమే సెలబ్రిటీల గురించి తెలుసుకునేవారు.అయితే ప్రస్తుతం ప్రతి ఒక్క విషయం కూడా అభిమానులకు తెలిసిపోతుంది. అయితే వాళ్లు ఎలాంటి వార్తలు రాసిన మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకోవాలి కానీ అక్కడే ఆగిపోకూడదు. ఒక్కసారి సెలబ్రిటీ స్టేటస్ వచ్చిందంటే నీకు పూలమాలలు వేసి సత్కరిస్తారు. అదే చేతితో టమోటాలు రాళ్లు కూడా వేస్తారంటూ ఈయన తెలియజేశారు.
బెంగళూరులో ఓ కుటుంబం గడచిన రోజుల్లో అనుభవించిన సంఘటన వాస్తవానికి ప్రతి తల్లిదండ్రి గుండెను గుద్దేసేలా ఉంది. రాత్రి ఇంటికి…
కేరళలోని ప్రముఖ రిటైల్ స్పేస్ కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులను అదిరిపోయే విధంగా సర్ప్రైజ్…
టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్డ్ పేర్లలో ఒకరు.…
సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…
ఉత్తరప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…
తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్లో సుహాస్ ఇప్పుడు…