Kiran Abbavaram: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నటుడు కిరణ్ అబ్బవరం. ఈయన దాదాపు నాలుగైదు సినిమాలలో నటించి ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈయనకు సరైన హిట్ ఏ సినిమా అందించలేకపోయింది.ఇక ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఏ హీరోని ఉద్దేశించి మాట్లాడిన ఆ హీరోలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంటారు.
ఈ క్రమంలోనే చిరంజీవి కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడిన మాటలు వల్ల ఈయన ఎంతో ఫీలయ్యారని తెలుస్తోంది.అసలు చిరంజీవి మాటలకు కిరణ్ అబ్బవరం ఫీల్ కావాల్సిన అవసరం ఏమి వచ్చింది. ఇంతకీ చిరు ఏం మాట్లాడారనే విషయానికి వస్తే… చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా చిరంజీవి రవితేజను దగ్గరికి తీసుకొని మాట్లాడుతూ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటించేది మేమిద్దరమే అంటూ కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే ఈ వీడియోని ఒక నెటిజన్ మార్ఫింగ్ చేస్తూ చిరంజీవి ఫేస్ కు బదులు కిరణ్ అబ్బవరం రవితేజ ఫేస్ కుబదులు ఆది సాయికుమార్ ఫోటోలను పెట్టి అదే డైలాగ్ ను యధావిధిగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతోమంది నేటిజన్స్ ఈ వీడియో పై నెగిటివ్ కామెంట్స్ తో రెచ్చిపోయారు. కిరణ్ అబ్బవరం సినిమాలు హిట్ కాకపోయినా బలవంతంగా ప్రేక్షకులపై రుద్దుతున్నారు అంటూ కొందరు కామెంట్లు చేయడంతో ఈ కామెంట్లకు కిరణ్ అబ్బవరం చాలా ఫీల్ అయ్యారు.
ఈ సందర్భంగా ఈ వీడియో పై స్పందించిన కిరణ్ మోవా నా మూడేళ్ళ కెరీర్ లో 5 సినిమాలు విడుదలయ్యాయి. అని నాకు తెలుసు. నాకు తెలియకుండా నా సినిమాలు ఏమైనా విడుదలై వుంటే నాకు చెప్పండి మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటా బ్రో అంటూ సదరు నెటిజన్ కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…