Kommanapalli Ganapathi Rao : నవలా రచయితగా రాసింది కొన్ని నావలలే అయినా అవన్నీ ప్రేక్షకాదరణ పొందిన నవలలే. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే మరో వైపు సాహిత్యరంగంలో కృషి చేసారు. ఇక ఆయన ‘హంసధ్వని’ అనే నవలను సీరియల్ రూపంలో పత్రికకు రాస్తున్న సమయంలో ఆయన రచనలు నచ్చి నిర్మాత కాట్రగడ్డ మురారి గారు ఆయనను సినిమా రంగానికి పరిచయం చేసారు. శోభన్ బాబు హీరో గా వచ్చిన ‘అభిమన్యుడు’ సినిమాకు మొదటి సారి పనిచేసారు. దాసరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు మంచి పేరు తెచ్చుకున్నారు. కుటుంబ కథా రచయితగా మంచి గుర్తింపు ఉన్న కొమ్మనపల్లి ఆయనకు నచ్చని పని చేయను అంటూ నిర్మొహమాటంగా చెప్పడం వల్ల ఇండస్ట్రీలో శత్రువులను కూడా పెంచుకున్నారట. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి రచయిత డైరెక్టర్ ను ఇండస్ట్రీకి అందించింది ఈయనే.
వాణిశ్రీ నాకు చాలా క్లోజ్… సౌందర్య తాగేటపుడు అలా చెప్పేది…
కొమ్మనాపల్లి గారు తన కెరీర్ సినిమాల గురించి మాట్లాడుతూ హీరోయిన్లలో సావిత్రి, వాణిశ్రీ అంటే చాలా ఇష్టమంటూ తెలిపారు. రచయితగా పనిచేస్తున్న సమయంలో వాణిశ్రీ గారు పరిచయమై బాగా క్లోజ్ అయ్యారంటూ తెలిపారు. తాను పెళ్లిచేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సమయంలో అందరి మీద చాలా కోపంతో ఉండేవారు. సినిమా షూటింగ్ సమయంలో ఏదైనా కొంచెం తేడా జరిగినా అలిగి వెళ్లిపోయేవారు. ఆ సమయంలో నిర్మాతలు డైరెక్టర్లు నా దగ్గరికి వచ్చి వెళ్లి మేడంను పిలుచుకురా, నీ మాట వింటారు అని పంపేవారు. నేను వెళ్లి మీకు చాలా జాలి ఎక్కువ, ఇలా అలగడం వల్ల నిర్మాతకు నష్టం అని మళ్ళీ సాయంత్రానికి మీరే బాధపడతారు అవసరమా రండి మీకోసం అందరూ ఎదురుచూస్తున్నారు అని చెబితే నిజామా గణపతి రావు అని అమాయకంగా అడిగేవారు. చాలా మంచి మనిషి వాణిశ్రీ అలాగే తనకు చాలా విషయాల్లో పట్టు ఉంది అంటూ తెలిపారు కొమ్మనాపల్లి.
ఇక సౌందర్య కూడా గొప్ప నటి అంటూ చెబుతూ చాలా గౌరవం ఇస్తుంది ఎదుటి వ్యక్తులకు అంటూ ఆమెతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ ‘మాయదారి కుటుంబం’ అనే సినిమాలో సౌందర్య దొంగగా నటించింది. ఆ సమయంలో ఒక రైటర్ దగ్గర రెండు లక్షల డబ్బులు కొట్టేసే సీన్ ఉండగా ఆ సీన్ రాస్తున్నప్పుడు వచ్చి మీరే ఆ సీన్ లో రైటర్ గా నటించవచ్చు కాడా అని అడిగింది. సౌందర్య తండ్రి డైరెక్టర్ అలానే నా నవలలను కన్నడలోకి తర్జుమా చేసారు అలా ముందు నుండి పరిచయం ఉంది అంటూ తెలిపారు.
ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…
వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…
రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…
ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…