Konda Surekha : తెలంగాణ రాజకీయంలో రాజశేఖర్ రెడ్డి అనుచరులుగా విశ్వాస పాత్రులగా మెలిగిన కొండా దంపతులు ఆయన మరణం తరువాత జగన్ కు దగ్గర కాలేదు. ఇక తెలంగాణ వచ్చాక జగన్ పార్టీ లో చేరి అక్కడ ఇమడ లేక మళ్ళీ టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యే గా గెలిచిన సురేఖ ఇక అక్కడా ఇమడ లేక మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. ఇక రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ మనిషి ఆంటూ చెప్పారు సురేఖ. జగన్ కు అభద్రతా భావం చాలా ఎక్కువ అందుకే ఆయన ఎవరినీ ఓర్చడు అంటూ చెప్పారు సురేఖ.
జగన్, షర్మిల కి అస్థి వివాదాలు ఉన్నాయి…
జగన్ కి తన ముందు ఎవరు ఎదిగినా నచ్చదు. అది ఇంట్లో వాళ్ళైనా సరే అంతే అందుకే షర్మిల రాజకియంగా ఎదగడం ఆయనకు ఇష్టం లేదు. ఆస్తి పంపకంలో గొడవలు వచ్చాయి జగన్, షర్మిల ఇద్దరికీ. ఇక అక్కడ మొదలై ఒకవేళ జగన్ జైలుకి వెళ్లాల్సి వస్తే నేనే సీఎం అవుతా అని అడిగితే జగన్ మాత్రం నా భార్య సీఎం అవ్వాలి అని చెప్పడంతో, అక్కడ గొడవలు ముదిరి హైదరాబాద్ కి షర్మిల వచ్చేసింది.
ఇక విజయమ్మ కూతురు పక్షాన నిలవడం వల్ల ఆమె కూడా హైదరాబాద్ కి వచ్చేసింది. కానీ తెలంగాణ లో పార్టీ పెట్టడం అది ఇప్పుడు షర్మిల తప్పే. తెలంగాణ వచ్చిన మొదట్లోనే పార్టీ పెట్టుండాల్సింది. లేక ఆంధ్రప్రదేశ్ లోనే కాంగ్రెస్ లోనే చేరి పార్టీని బలోపేతం చేయాల్సింది. తన తండ్రి చివరి దాకా ఉన్న పార్టీ లో షర్మిల ఉండుంటే బాగుండేది అని కొండ సురేఖ అభిప్రాయపడ్డారు.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…