Lakshmi Vasudevan:ప్రస్తుత కాలంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు రోజురోజుకు శృతిమించి పోతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీల నుంచి మొదలుకొని చిన్నచిన్న ఆర్టిస్టుల వరకు వారి ఫోన్లను హ్యాక్ చేస్తూ వారికి ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించడం లేదా వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ బుల్లితెర నటి లక్ష్మీ వాసుదేవన్ కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎవరు కూడా తనలా తప్పు చేయొద్దని అందరిని అలర్ట్ చేసింది. ఎవరో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి తన వాట్సప్ గ్రూపులకు తనకు తెలిసిన వారికి ఫోటోలను షేర్ చేస్తూ తనని డబ్బులు కావాలంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ తప్పు జరగడానికి తానే కారణమని ఎవరు కూడా ఇలాంటి తప్పు చేయొద్దు అంటూ ఈమె అందరికీ సూచించారు.గత కొద్ది రోజుల క్రితం నా అకౌంట్లో 5 లక్షల క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దాంతో తను ఆ లింక్ ఓపెన్ చేయగానే తనకు తెలియకుండానే ఒక యాప్ డౌన్లోడ్ అయిందని తద్వారా తన ఫోన్ హ్యాక్ కావడంతో తన ఫోటోలను కొందరు సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేసి తన వాట్సాప్ గ్రూప్ కు పంపించారు
అదేవిధంగా ఐదు వేల రూపాయల డబ్బులు పంపకుంటే ఈ ఫోటోలను మరింత మందికి ఫార్వర్డ్ చేస్తామని బెదిరిస్తున్నట్టు ఈమె వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈమె హైదరాబాద్ సైబర్ పోలీసులను ఆశ్రయించి అసలు విషయం వెల్లడించారు. తన వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలిసిందే.అయితే పొరపాటున నేను చేసిన తప్పు వల్ల ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఇలాంటి తప్పు మరొకరు చేయొద్దు అంటూ ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన ఫోన్ హ్యాక్ అయిన విషయాన్ని వెల్లడించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…