అమరావతి: తన వద్ద డ్రైవర్గా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు (22) హత్య కేసులో అరెస్టయిన శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్చార్జ్ కోట వినుతకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆమె A3 నిందితురాలిగా ఉన్నారు. కోర్టు కొన్ని కఠిన షరతులతో బెయిల్ ఇచ్చింది. విచారణ పూర్తయ్యే వరకు ఆమె ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు చెన్నై C3 సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం చేయాల్సి ఉంటుంది.
హత్య కేసు వివరాలు
శ్రీనివాసులు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, కోట వినుత వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా, డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు. అయితే, అతడిపై వినుత దంపతులకు అనుమానం పెరిగింది. వ్యక్తిగత రహస్యాలను, పార్టీ విషయాలను బయటపెడుతున్నాడనే కోపంతో వినుత, ఆమె భర్త చంద్రశేఖర్తో పాటు మరో ముగ్గురు కలిసి శ్రీనివాసులను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతదేహాన్ని చెన్నైకి తీసుకెళ్లి నదిలో పడేసి ఆధారాలు లేకుండా చేయాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు చాకచక్యంగా ఈ కేసును ఛేదించి, నిందితులను అరెస్టు చేశారు.
వినుతను బహిష్కరించిన జనసేన
ఈ కేసులో వినుత అరెస్టు అయిన నేపథ్యంలో, జనసేన పార్టీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది కోట వినుతకు బెయిల్ లభించిన అదే సమయంలో జరిగింది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…