80-year-old man loses Rs. 9 crore to the deceit of 4 women..
ముంబై: సైబర్ నేరగాళ్ల వలలో పడి అమాయక ప్రజలు కోట్ల రూపాయలు కోల్పోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ముంబైలో 80 ఏళ్ల వృద్ధుడు, ఫేస్బుక్లో ఓ పరిచయం కారణంగా ఏకంగా దాదాపు రూ. 9 కోట్లు కోల్పోయాడు. డెమెన్షియా (మతిమరుపు) ఉన్న ఈ వృద్ధుడి బలహీనతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ భారీ మోసానికి పాల్పడ్డారు.
ఫేస్బుక్లో మొదలైన స్నేహం..
2023 ఏప్రిల్లో ముంబైకి చెందిన ఆ వృద్ధుడు షార్వి అనే మహిళకు ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. మొదట ఆమె తిరస్కరించినా, కొద్దిరోజుల తర్వాత తిరిగి రిక్వెస్ట్ పంపి స్నేహం మొదలుపెట్టింది. వాట్సాప్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత, ఆమె తన భర్త నుంచి విడిపోయానని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెబుతూ డబ్బులు అడిగింది. ఆమె మాటలు నమ్మి వృద్ధుడు పలు దఫాలుగా డబ్బు పంపించాడు.
నకిలీ అకౌంట్లతో మోసం
ఆ తర్వాత, కవిత అనే మరో మహిళ షార్వి ద్వారా పరిచయం అయినట్లు చెప్పి, అసభ్యకరమైన సందేశాలు పంపి డబ్బులు డిమాండ్ చేసింది. దీనితో పాటు, దినాజ్ అనే పేరుతో వచ్చిన మరొక అకౌంట్ నుంచి తాను షార్వి సోదరినని చెప్పి, షార్వి చనిపోయిందని అబద్ధం చెప్పింది. ఆసుపత్రి ఖర్చుల పేరుతో డబ్బు వసూలు చేయడంతో పాటు, పెళ్లి చేసుకోవాలనే ఆశలు రేకెత్తించి మరింత డబ్బును లాగింది. ఇంత జరిగినా మేలుకోని వృద్ధుడు, జాస్మిన్ అనే మరో మహిళ నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ను కూడా అంగీకరించి, ఆమెకు కూడా డబ్బు పంపించాడు.
అసలు విషయం బయటపడిందిలా..
మొత్తంగా 21 నెలల్లో నాలుగు నకిలీ అకౌంట్లకు 734 సార్లు నగదు బదిలీ చేసి, దాదాపు రూ. 9 కోట్లు కోల్పోయాడు. తన దగ్గర డబ్బు అయిపోవడంతో, కోడలి దగ్గర రూ. 2 లక్షలు, కొడుకు దగ్గర రూ. 5 లక్షలు అడగగా, కొడుకుకు అనుమానం వచ్చి నిలదీయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన వృద్ధుడు తీవ్ర ఆవేదనతో ఆసుపత్రిలో చేరాడు. అతనికి వైద్యులు డెమెన్షియా ఉన్నట్లు నిర్ధారించారు. జూలై 22న కుటుంబ సభ్యులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నలుగురు మహిళల పేర్లు ఉన్నప్పటికీ, వేర్వేరు నంబర్లతో ఒకే వ్యక్తి ఈ మోసానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…