80-year-old man loses Rs. 9 crore to the deceit of 4 women..
ముంబై: సైబర్ నేరగాళ్ల వలలో పడి అమాయక ప్రజలు కోట్ల రూపాయలు కోల్పోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ముంబైలో 80 ఏళ్ల వృద్ధుడు, ఫేస్బుక్లో ఓ పరిచయం కారణంగా ఏకంగా దాదాపు రూ. 9 కోట్లు కోల్పోయాడు. డెమెన్షియా (మతిమరుపు) ఉన్న ఈ వృద్ధుడి బలహీనతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ భారీ మోసానికి పాల్పడ్డారు.
ఫేస్బుక్లో మొదలైన స్నేహం..
2023 ఏప్రిల్లో ముంబైకి చెందిన ఆ వృద్ధుడు షార్వి అనే మహిళకు ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. మొదట ఆమె తిరస్కరించినా, కొద్దిరోజుల తర్వాత తిరిగి రిక్వెస్ట్ పంపి స్నేహం మొదలుపెట్టింది. వాట్సాప్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత, ఆమె తన భర్త నుంచి విడిపోయానని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెబుతూ డబ్బులు అడిగింది. ఆమె మాటలు నమ్మి వృద్ధుడు పలు దఫాలుగా డబ్బు పంపించాడు.
నకిలీ అకౌంట్లతో మోసం
ఆ తర్వాత, కవిత అనే మరో మహిళ షార్వి ద్వారా పరిచయం అయినట్లు చెప్పి, అసభ్యకరమైన సందేశాలు పంపి డబ్బులు డిమాండ్ చేసింది. దీనితో పాటు, దినాజ్ అనే పేరుతో వచ్చిన మరొక అకౌంట్ నుంచి తాను షార్వి సోదరినని చెప్పి, షార్వి చనిపోయిందని అబద్ధం చెప్పింది. ఆసుపత్రి ఖర్చుల పేరుతో డబ్బు వసూలు చేయడంతో పాటు, పెళ్లి చేసుకోవాలనే ఆశలు రేకెత్తించి మరింత డబ్బును లాగింది. ఇంత జరిగినా మేలుకోని వృద్ధుడు, జాస్మిన్ అనే మరో మహిళ నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ను కూడా అంగీకరించి, ఆమెకు కూడా డబ్బు పంపించాడు.
అసలు విషయం బయటపడిందిలా..
మొత్తంగా 21 నెలల్లో నాలుగు నకిలీ అకౌంట్లకు 734 సార్లు నగదు బదిలీ చేసి, దాదాపు రూ. 9 కోట్లు కోల్పోయాడు. తన దగ్గర డబ్బు అయిపోవడంతో, కోడలి దగ్గర రూ. 2 లక్షలు, కొడుకు దగ్గర రూ. 5 లక్షలు అడగగా, కొడుకుకు అనుమానం వచ్చి నిలదీయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన వృద్ధుడు తీవ్ర ఆవేదనతో ఆసుపత్రిలో చేరాడు. అతనికి వైద్యులు డెమెన్షియా ఉన్నట్లు నిర్ధారించారు. జూలై 22న కుటుంబ సభ్యులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నలుగురు మహిళల పేర్లు ఉన్నప్పటికీ, వేర్వేరు నంబర్లతో ఒకే వ్యక్తి ఈ మోసానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…