Kotamreddy Sridhar Reddy : నెల్లూరు రాజకీయం కోటంరెడ్డి ప్రెస్ మీట్ తో వేడెక్కింది. జగన్ మీద తిరుగుబాటు చేసిన కోటంరెడ్డి ప్రభుత్వంపై అనేక ఆరోపణలను చేసారు. ఎన్నికలకు ఏడాది సమయం ఇంకా ఉన్నపుడే అసమ్మతి జ్వాలలు వైసీపీ ఎదుర్కొనవలసి వస్తోంది. జగన్ తనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం పలువురు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడిన సంగతి తెలిసిందే. అలా కోటంరెడ్డిని పిలిచి తిట్టారంటూ బయటకి కొంతమంది లీక్ ఇచ్చినా వాటి మీద తనదైన సమాధానం కోటంరెడ్డి వివరించారు. అలాగే భవిష్యత్ రాజకీయాల గురించి తన తమ్ముడి రాజకీయ భవిష్యత్తు గురించి ఇటీవల ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
తమ్ముడిని ఎమ్మెల్యే చేయాలనుకున్నా…
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నుండి నాపై ఆరోపణలు చేస్తున్న సజ్జల వంటి వారు నేను చంద్రబాబు నాయుడు ని డిసెంబర్ 21 న కలిసానని చెబుతున్నారు. ఒకవేళ అప్పుడే కలిసుంటే వారికి తెలిసీ ఎందుకు పార్టీలో ఉంచారు, అప్పుడే తొలగించాల్సింది కదా. అవన్నీ ఒట్టి ఆరోపణలయి అంటూ చెప్పారు. ఇక తమ్ముడికి వైసీపీ ని వీడడం ఇష్టం లేదు అసంతృప్తితో ఉన్నారు అన్న మాటలకు అదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు.
తనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్తిగా వచ్చే ఎన్నికలలో నిలబెట్టాలని అనుకున్నాను. తనకి ఆ మాట చెప్పాను కానీ చివరికి ఇలా అయింది, నేనే నిలబడతాను అన్నట్లుగా చెప్పారు కోటంరెడ్డి. తమ్ముడి రాజకీయ భవిష్యత్తును ఆలోచిస్తున్నట్లు, ఈ సరి ఎన్నికలలో వైసీపీ కి పోటీగా నిలబడిన గెలుస్తాననే ధీమా ఉందని, జగన్ కి 175 సీట్లు గెలుస్తాననే నమ్మకం ఉన్నపుడు నాకు నా ఎమ్మెల్యే సీట్ గెలుస్తానని నమ్మకం ఎందుకు ఉండకూడదు అంటూ చెప్పారు. చంద్రబాబు ను ఇంతవరకూ కలవలేదని, కావాలనే సజ్జల రామకృష్ణ వంటి వారు నాపై బురద జల్లారంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…