Krishnam Raju First Wife: టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు అనారోగ్య సమస్య కారణంగా నేడు ఆసుపత్రిలో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఈయన మరణ వార్త తెలియగానే సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి చేరుకొని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించనున్నారు. ఇప్పటికే హాస్పిటల్ నుంచి కృష్ణంరాజు భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించినట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కృష్ణంరాజు గారిని హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించే చికిత్స చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో నేడు తెల్లవారుజామున ఈయన తుది శ్వాస విడిచారు.ఇలా కృష్ణం రాజుగారు చనిపోయారని విషయం తెలియడంతో ఇండస్ట్రీలోని ఎంతో మంది సెలబ్రిటీలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన 1940 జనవరి 20 వ తేదీ మొగల్తూరులో జన్మించారు. ఈయన విద్యభ్యాసం మొత్తం నరసాపురంలోనే జరిగింది. ఇక ఈయన మొదటి వివాహాన్ని సీతాదేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.ఇలా తన భార్యతో వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి కృష్ణంరాజుకు కారు ప్రమాదంలో తన భార్య సీతాదేవి మరణించడం తనని శోకసంద్రంలోకి నెట్టివేసింది.
ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట పట్ల ఆ దైవం కూడా కుళ్ళుకుందేమో ఇలా కారు ప్రమాదంలో సీతాదేవిని తీసుకెళ్లిపోయారు. మీరు ప్రేమకు గుర్తుగా ఒక అమ్మాయి కూడా ఉన్నారు. ఇకపోతే సీతాదేవి మరణించడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఈయన కుటుంబ సభ్యుల బలవంతంతో 1996లో శ్యామల దేవిని వివాహం చేసుకున్నారు. ఇక వీరికి ముగ్గురు కుమార్తెలు.ఇక ఈయనకు వారసులు లేకపోవడంతో తన సోదరుడు కుమారుడు ప్రభాస్ ను తన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్థాయి హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…