Krithi Shetty: నితిన్,కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ సరసన ముందుగా నటించే అవకాశం కృతి శెట్టికి కాకుండా నేషనల్ క్రష్ రష్మికకు అవకాశం వచ్చింది.అయితే రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ఆమె స్థానంలో కృతి శెట్టి అవకాశం వచ్చిందని తెలుస్తుంది.
ఇకపోతే రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేయడానికి గల కారణం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో నితిన్ రష్మిక ఇద్దరు జంటగా నటించిన చిత్రం భీష్మ. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా చేయాలని భావించారు.అయితే భీష్మ సినిమా షూటింగ్ సమయంలో నితిన్ రష్మిక మధ్య ఏదో మనస్పర్ధలు తలెత్తాయని ఆ కారణం చేత రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేసిందని ఇండస్ట్రీలో గుసగుసలు వస్తున్నాయి.
ఇకపోతే రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేయడానికి మరో కారణం కూడా తెలుస్తోంది. రష్మిక అప్పటికే పలు సినిమాలకు కమిట్ కావడం వల్ల తనకు కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేసిందని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ రష్మిక మాత్రం ఈ సినిమాని వదులుకుంటేనే కృతి శెట్టి అవకాశం వచ్చిందని తెలుస్తోంది.
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…
ప్రముఖ నటుడు Sonu Sood తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం…