Krithi Shetty: నితిన్,కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ సరసన ముందుగా నటించే అవకాశం కృతి శెట్టికి కాకుండా నేషనల్ క్రష్ రష్మికకు అవకాశం వచ్చింది.అయితే రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ఆమె స్థానంలో కృతి శెట్టి అవకాశం వచ్చిందని తెలుస్తుంది.
ఇకపోతే రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేయడానికి గల కారణం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో నితిన్ రష్మిక ఇద్దరు జంటగా నటించిన చిత్రం భీష్మ. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా చేయాలని భావించారు.అయితే భీష్మ సినిమా షూటింగ్ సమయంలో నితిన్ రష్మిక మధ్య ఏదో మనస్పర్ధలు తలెత్తాయని ఆ కారణం చేత రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేసిందని ఇండస్ట్రీలో గుసగుసలు వస్తున్నాయి.
ఇకపోతే రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేయడానికి మరో కారణం కూడా తెలుస్తోంది. రష్మిక అప్పటికే పలు సినిమాలకు కమిట్ కావడం వల్ల తనకు కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేసిందని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ రష్మిక మాత్రం ఈ సినిమాని వదులుకుంటేనే కృతి శెట్టి అవకాశం వచ్చిందని తెలుస్తోంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…