Krithi Shetty: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంటి ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకు వచ్చింది. ఇకపోతే ఉప్పెన సినిమా తర్వాత ఈమె మాచర్ల నియోజకవర్గం, కస్టడీ బంగార్రాజు, ది వారియర్, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో కృతి శెట్టి ఎటువంటి సినిమాలలో నటించలేదు. ఇటీవలె ఒక సినిమాను కూడా ప్రకటించింది.
తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. కానీ ఈమె తరచూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ సందడి సందడి చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్ళిన కృతిశెట్టి కి ఊహించని షాకింగ్ అనుభవాలు ఎదురయ్యాయి. ఒక అభిమాని మాటలు షాక్ ఇచ్చాయి. మాల్ లో మాట్లాడుతుండగా.. ఫ్యాన్ ఒకరు మీరు నటించిన స్కంద చిత్రం బాగుందని అన్నారు. దాంతో కృతిశెట్టి షాక్ అయ్యింది. థ్యాంక్యూ అని చెబుతూనే.. అందులో నేను లేను అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. పాపం అభిమానులు బేబమ్మను మరిచిపోతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సదరు అభిమాని శ్రీ లీల అనుకొని కృతిశెట్టికి ఆ కామెంట్ చేశారు. బాగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో పై శ్రీ లీలా అభిమానులు, కృతి శెట్టి అభిమానులు పోటాపోటీగా కామెంట్స్ చేస్తున్నారు.
అక్కడ అవకాశాలు అందుకుంటున్న బేబమ్మ..
ఇకపోతే శ్రీలీలా విషయానికి వస్తే ఆమె ఇండస్ట్రీలో శ్రీలీలా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. వరుస చిత్రాలతో దుమ్ములేపుతోంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. శ్రీలీలా దెబ్బకు బేబమ్మ క్రేజ్ తగ్గిపోయింది. ఏదేమైనా కృతిశెట్టి మాత్రం కోలీవుడ్ ప్రస్తుతం మంచి అవకాశాలు అందుకుంటోంది. కాగా కృతిశెట్టికి తెలుగులో అవకాశాలు లేకపోయినప్పటికీ తమిళంలో వరుసగా అవకాశాలను అందుకుంటూ క్రేజీ హీరోయిన్గా రాణిస్తోంది. ఇటీవలే ప్రదీప్ రంగనాథన్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది కృతిశెట్టి.
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…