Ilayaraja: తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలకు మంచి మంచి సంగీతాలను అందించి సంగీత దర్శకుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు ఇళయరాజా. ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆయన కూతురు, గాయకురాలు భవతరణి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె తాజాగా తుది శ్వాస విడిచారు. తాజాగా పరిస్థితి విషమించడం వల్ల శ్రీలంకలోని ఒక ప్రైవైట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయినా ఫలితం దక్కలేదు.
ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి గురువారం ఆమె కన్నుమూశారు. జనవరి 26 సాయంత్రం ఆమె భౌతికకాయం చెన్నైకి రానున్నట్లు తెలిసింది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మరణవార్త తెలిసిన తమిళ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రియులు కూడా నెట్టింట్లో ఇళయరాజా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలలుపుతున్నారు. కూతురి మరణంతో ఇళయరాజా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఆమె మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సెలబ్రిటీలు ఆమెకు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తండ్రి సారథ్యంలో ఎక్కువ పాటలు..
ఇకపోతే భవతరణి విషయానికి వస్తే.. ఈమె తమిళంలో పలు సినిమాలకు మంచి మంచి సాంగ్స్ పాడి సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. ఎక్కువగా తన తండ్రి, సోదరుల సంగీత సారథ్యంలోనే ఎక్కువగా పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. భారతి సినిమాలోని మయిల్ పోల పొన్ను ఒన్ను అనే తమిళ సాంగ్కు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు కూడా పొందారు. కాగా సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా కూడా ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా నేడు సాయంత్రం ఆమె భౌతిక కాయం చెన్నైకి రానున్నట్లు తెలుస్తోంది. రేపు అనగా జనవరి 27 ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…