Featured
KTR : స్కెచ్ గీసిన కేటీఆర్.. ఏంటిది వేళ కాని వేళలోనా?
Published
2 months agoon
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని అప్పుడెప్పుడో ఓ సినీ కవి చెప్పారు. ఈ విషయాన్ని కాస్త ఒంట బట్టించుకుంటే బాగుండేది.. లేదు ఆలస్యం.. అమృతం.. విషం అన్నారు కదా… దానినైనా అర్థం చేసుకుని తొందరపడి ఉంటే బాగుండేది. అటు ఇటు కానీ సమయంలో తొందరెందుకు? ఏంటిది సూక్తుల మీద సూక్తులు? ఇంతకీ ఎవరి గురించి అంటారా? ఇంకెవరి గురించి మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి. ఆయనో స్కెచ్ వేశారు. వేసిన స్కెచ్ మంచిదే. కానీ చాలా ఆలస్యమైంది.. చాలా తొందరపడుతున్నారు.. అటు ఇటు కానీ సమయంలో స్కెచ్ గీశారు. మళ్లీ మొదలు పెట్టేశాం అంటారా? అసలు ఏంటా స్కెచ్? దాని వల్ల చేకూరే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు గీయడం వలన అభ్యంతరం ఏంటి? అంటే ఈ ఆర్టికల్పై ఓ లుక్ వేయాల్సిందే..
ట్రెండ్ సెట్ చేసింది వైఎస్సే..
పాదయాత్ర.. ఎన్నికల సమయంలో ఇదొక ట్రెండ్.. ఈ ట్రెండ్ను సెట్ చేసింది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి అనడంలో సందేహం లేదు. ఈ పాదయాత్రను నిర్వహించి వైఎస్ ఏకంగా సీఎం పీఠంపై కూర్చున్నారు. ఇక ఆ తరువాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే దారి పాదయాత్ర.. కట్ చేస్తే సీఎం పీఠం. ఏపీలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ సైతం ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశారు. తను మంత్రయ్యారు.. తండ్రిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. పాదయాత్ర అనేది రాజకీయ నాయకులకు సంబంధించి పవర్ఫుల్ మంత్రం. ఇప్పుడు ఈ మంత్రాన్ని కేటీఆర్ పఠించాలని అనుకుంటున్నారు. మీరే చెప్పండి.. ఆలస్యమైందా.. కాలేదా? ఎన్నికలకు ముందు చేస్తే జనంలో బాగా నోటెడ్ అవుతారు.. జనం సమస్యల పరిష్కారంపై భరోసా ఇచ్చినట్టుగానూ అవుతుంది. దీనికోసం నాలుగేళ్లు ఆగాలి కదా.. మరి కేటీఆర్ ఎందుకు ఇంత తొందరపడుతున్నట్టు. వేళగాని వేళ ఏ మంత్రమైనా సరే పఠిస్తే ప్రయోజనం ఉంటుందా? దానికో నిర్ధిష్ట సమయం.. సందర్భం ఉంటుంది.
రీకాల్ చేసేంత డెవలప్ చెందలేదు కదా?
అయితే ఈ మంత్రం ఇప్పటి వరకూ ప్రతిపక్షంలో ఉన్నవారు మాత్రమే పఠించారు కాబట్టి కేటీఆర్ ఎన్నికలకు ముందు పఠించినా ప్రయోజనం ఉండేది కాదేమో. ఎన్నికలకు ముందు అది కూడా అధికార పార్టీ నేత పాదయాత్ర అంటే జనం ఎలా రిసీవ్ చేసుకునేవారో తెలిసేది. ఇప్పుడు రిసీవ్ చేసుకున్నా ప్రయోజనం శూన్యం. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025 జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కేటీఆర్ పాదయాత్ర చేస్తారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేటీఆర్ షెడ్యూల్ అంతా ఖరారవుతోందట. అయినా సరే టూ ఎర్లీ కదా.. 2028లో పాదయాత్ర చేస్తే బాగుంటుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. బీఆర్ఎస్ ఆలోచనా విధానం మరోలా ఉంది. కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో నిరుద్యోగులు, రైతులు, కరెంట్ కష్టాలవంటివి బీభత్సంగా పెరిగి పోయాయి. కాబట్టి వాటిని జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. తీసుకెళ్లి మాత్రం ఇప్పుడేం చేస్తుంది? ఏం సాధిస్తుంది? ఎన్నుకున్న నేతలను రీకాల్ చేసేంత డెవలప్ అయితే మనం చెందలేదు కదా అంటారా? అయితే కేడర్లో ఎంతో కొంత ఉత్సాహాన్ని అయితే తీసుకురావచ్చు. బీఆర్ఎస్ దీపం పూర్తిగా కొండెక్కకుండా కాస్త చమురు పోసే యత్నం. అంతకు మించి గులాబీ బాస్ కేసీఆర్.. తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠంపై కూర్చోబెట్టే యోచన అని కూడా అంటున్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..
You may like
Harish Rao : ఆయకట్టుకు నీళ్లు అందించండి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీష్ రావు!
CM Revanth Reddy : ముఖ్యమంత్రులే మారారు.. మిగతాదంతా సేమ్ టు సేమ్..!
Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ
Kavitha: కవిత అరెస్టు వెనుక ఇంత కథ ఉందా.. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కామెంట్స్ వైరల్!
Chiranjeevi: మెగా విందుకు హాజరైన రేవంత్ రెడ్డి.. చిరంజీవికి ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం?
Dil Raju: ఎన్నికలవేళ కెసిఆర్ ని కలిసిన దిల్ రాజు.. రాజకీయంగా మొదలైన చర్చలు?
Featured
Vishnu Priya: హౌస్ లో విష్ణుప్రియ బట్టలు మార్చుకోవడం చూసింది అతనేనా.. ఎవరంటే?
Published
1 hour agoon
13 September 2024By
lakshanaVishnu Priya: బిగ్ బాస్ హౌస్ అంటేనే పెద్ద ఎత్తున గొడవలు వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్ల మధ్య ఇలాంటి గొడవలే జరుగుతున్నాయి. ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతున్న విష్ణు ప్రియ సోనియా మధ్య భారీ స్థాయిలో వివాదం జరుగుతుంది. సోనియా విష్ణు ప్రియ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది.
నీకు ఫ్యామిలీ లేదు నాకు ఫ్యామిలీ ఉంది నీలాగా బట్టలు వేసుకుని తిరగలేను అంటూ ఇస్టానుసారంగా మాట్లాడటంతో సోనియా బాగా నెగిటివ్ అవుతుంది. నిజానికి విష్ణు ప్రియ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బిగ్ బాస్ హౌస్లో చేయలేదు. అంతేకాకుండా సోనియా ఫేమస్ అవడం కోసం విష్ణు ప్రియను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
ఇక విష్ణు ప్రియ గురించి నిఖిల్, అభయ్ దగ్గర మాట్లాడుతూ.. విష్ణుప్రియ రూమ్లో బట్టలు మార్చుకుంటూ ఉంటే ఆదిత్య ఆ రూంలోకి వెళ్లారు. అయన వణుకుతూ బయటకు వచ్చారు.. ఆమె జస్ట్ బ్లౌజ్ లో ఉంది మళ్లీ వచ్చి ఆదిత్య గారు ఆన్ కంఫర్ట్బుల్ గా ఫీల్ చేశాను సారీ సారీ అని చెప్తుంది.
ఆదిత్య ఓం..
నిజానికి ఆదిత్య ఓం అంత అన్ కంఫర్ట్బుల్ ఫీల్ అయ్యారని అతనికి కూడా తెలియకపోవడం గమనించాల్సిన విషయం. సోనియా హౌస్ లో ఫేమస్ అవడం కోసం కేవలం విష్ణు ప్రియ ను టార్గెట్ చేస్తూ రావడంతో ఈమె పట్ల అభిమానులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందు తనని హౌస్ నుంచి బయటకు పంపించేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఘటనపై ఈ వారం నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.
Featured
Janhvi Kapoor: దేవర ప్రమోషన్స్ కోసం జాన్వీ కట్టిన ఈ చీర ఖరీదు తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?
Published
1 hour agoon
13 September 2024By
lakshanaJanhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్. ఇదివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ముంబైలో ఎంతో ఘనంగా లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ పాత్రలో నటించారు.
ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా జాన్వీ కపూర్ గులాబీ రంగు చీర కట్టుకొని సందడి చేశారు. అయితే ఈమె చీర అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈమె కట్టిన ఈ చీర ఖరీదు ఎంత ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఈ వేడుకలో జాన్వీ కపూర్ నచికేత్ బ్రావే డిజైన్ చీరను కట్టారు.
దేవర…
ఈ చీర ఖరీదు అక్షరాల రూ. 1,24,850. అలాగే పింక్ శారీకి పెయిర్ అప్ గా చెవులకు జాన్వీ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ధర రూ. 13 లక్షలని తెలిసిన అభిమానులు ఒకసారిగా షాక్ అవుతున్నారు. ఇలా సెలబ్రిటీలు బ్రాండెడ్ దుస్తులను ధరించడం సర్వసాధారణం. ఇక దేవర సినిమా ద్వారా మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమె ఈ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
Featured
Star Anchor: నాట్యం చేస్తున్న ఈ నాట్య మయూరిని గుర్తుపట్టారా… ఇప్పుడు టాప్ యాంకర్?
Published
1 hour agoon
13 September 2024By
lakshanaStar Anchor: సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా వారి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు ఆ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. తాజాగా ఒక యాంకరమ్మ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
నాట్యం మయూరిలా ఎంతో చక్కగా నాట్యం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె అభిమానులు ఈ ఫోటోను మరింత వైరల్ చేస్తున్నారు. మరి ఈ ఫోటోలో ఉన్న ఈమె ఎవరో తెలుసా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్. ఎస్ మీరు గెస్ చేసినది కరెక్టే ఇక్కడ ఉన్నది యాంకర్ సుమ.
సుమా కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తన తల్లి తండ్రుల ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చారు. ఇక హైదరాబాదులో ఉంటూనే ఈమె ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. మొదట దేవదాస్ కనకాల దర్శకత్వంలో వచ్చిన మేఘమాల సీరియల్ తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడటం ఆ పరిచయము కాస్త ప్రేమగా మారడం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది.
యాంకర్ సుమ..
ఇలా పెళ్లి తర్వాత కూడా సుమ ఇండస్ట్రీలో పలు సినిమాలు అలాగే సీరియల్స్ లో నటించారు. అనంతరం యాంకర్ గా కూడా మారి ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా ఎంతో బిజీగా కొనసాగుతున్నారు. ఏదైనా ఒక సినిమా వేడుక జరుగుతుంది అంటే కచ్చితంగా ఆ కార్యక్రమంలో సుమ ఉండాల్సిందే. ఆ సినిమా టీజర్ లాంచ్ నుంచి మొదలుకొని సక్సెస్ మీట్ వరకు సుమ పాత్ర ఎంతగానో ఉంటుందని చెప్పాలి.
Vishnu Priya: హౌస్ లో విష్ణుప్రియ బట్టలు మార్చుకోవడం చూసింది అతనేనా.. ఎవరంటే?
Janhvi Kapoor: దేవర ప్రమోషన్స్ కోసం జాన్వీ కట్టిన ఈ చీర ఖరీదు తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?
Star Anchor: నాట్యం చేస్తున్న ఈ నాట్య మయూరిని గుర్తుపట్టారా… ఇప్పుడు టాప్ యాంకర్?
Sonia Akula:వర్మ ఇంటికి రమ్మన్నారు.. ఇంటికి వెళ్తే అలా జరిగింది… షాకింగ్ కామెంట్స్ చేసిన సోనియా?
Bigg Boss 8: రెండో వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఆమెనా… అమ్మాయిలే టార్గెటా?
Lakshmipathi : కమెడియన్ లక్ష్మీపతి కుమారుడు టాలీవుడ్ హీరో అని తెలుసా… ఎవరంటే?
John Abraham : ఒకప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు.. కట్ చేస్తే 500 కోట్లకు అధిపతి.. ఈ హీరో గురించి తెలుసా?
Ankitha: ఎన్టీఆర్ హీరోయిన్ అంకిత ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేస్తుందో తెలుసా?
Bigg Boss 8: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా నందమూరి హీరో… ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
Trending
- Featured3 weeks ago
Lakshmipathi : కమెడియన్ లక్ష్మీపతి కుమారుడు టాలీవుడ్ హీరో అని తెలుసా… ఎవరంటే?
- Featured3 weeks ago
John Abraham : ఒకప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు.. కట్ చేస్తే 500 కోట్లకు అధిపతి.. ఈ హీరో గురించి తెలుసా?
- Featured4 weeks ago
Ankitha: ఎన్టీఆర్ హీరోయిన్ అంకిత ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేస్తుందో తెలుసా?
- Featured1 week ago
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
- Featured4 weeks ago
Bigg Boss 8: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా నందమూరి హీరో… ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
- Featured1 week ago
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Featured3 weeks ago
Chiranjeevi: మూడుసార్లు చిరు సినిమాలను రిజెక్ట్ చేసి అవమానించిన స్టార్ హీరోయిన్…. మరీ అంత తల పొగరా?
- Featured2 weeks ago
Sri Devi: 37 ఏళ్ల వయసులో హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ హీరోయిన్.. సక్సెస్ అయ్యేనా?