Political News

AP: ఏపీలో వైసీపీ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

AP: ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈసారి 164 సీట్ల మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కూటమి అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా వైసిపి నేతలు కార్యకర్తలు అభిమానులు షాక్ అయ్యారు. 2019వ సంవత్సరంలో 151 సీట్లతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ హాస్పిటల్స్ ఎంతో అభివృద్ధి చేశారు అలాగే మెడికల్ కాలేజీలు, పోర్టులు వంటి వాటిని నిర్మిస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను కూడా అందించారు. దీంతో కచ్చితంగా ఈసారి కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు.

ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు ఊహించని విధంగా వైసిపి ఘోరమైన ఓటమిని ఎదుర్కోవడమే కాకుండా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు అయితే వైసీపీ ఫలితాలపై ఇటీవల ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

ఏపీ ఎన్నికల ఫలితాల గురించి ఈయనకు ప్రశ్నలు రావడంతో ఈయన క్లారిటీ ఇచ్చారు. ఈ పార్టీ ఓడిన 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదని తెలిపారు. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని తెలిపారు. ఇక షర్మిలను పావులా ఉపయోగించుకున్నారని, అంతకుమించి ఆమె పాత్ర ఏమాత్రం లేదని కేటీఆర్ తెలిపారు.

కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటి…
ఇక ధర్మవరం ఎమ్మెల్యే గా ఉన్నటువంటి కేతిరెడ్డి ప్రతిరోజు ప్రజలలోకి వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అక్కడే పరిష్కరించేవారు అలాంటి కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమే అంటూ కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago