Political News

AP: ఏపీలో వైసీపీ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

AP: ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈసారి 164 సీట్ల మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కూటమి అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా వైసిపి నేతలు కార్యకర్తలు అభిమానులు షాక్ అయ్యారు. 2019వ సంవత్సరంలో 151 సీట్లతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ హాస్పిటల్స్ ఎంతో అభివృద్ధి చేశారు అలాగే మెడికల్ కాలేజీలు, పోర్టులు వంటి వాటిని నిర్మిస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను కూడా అందించారు. దీంతో కచ్చితంగా ఈసారి కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు.

ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు ఊహించని విధంగా వైసిపి ఘోరమైన ఓటమిని ఎదుర్కోవడమే కాకుండా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు అయితే వైసీపీ ఫలితాలపై ఇటీవల ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

ఏపీ ఎన్నికల ఫలితాల గురించి ఈయనకు ప్రశ్నలు రావడంతో ఈయన క్లారిటీ ఇచ్చారు. ఈ పార్టీ ఓడిన 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదని తెలిపారు. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని తెలిపారు. ఇక షర్మిలను పావులా ఉపయోగించుకున్నారని, అంతకుమించి ఆమె పాత్ర ఏమాత్రం లేదని కేటీఆర్ తెలిపారు.

కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటి…
ఇక ధర్మవరం ఎమ్మెల్యే గా ఉన్నటువంటి కేతిరెడ్డి ప్రతిరోజు ప్రజలలోకి వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అక్కడే పరిష్కరించేవారు అలాంటి కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమే అంటూ కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెళ్లి చేసుకోబోతుందా సంయుక్త మీనన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్

మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…

1 hour ago

ఈ ఒక్క పండు మీ గట్ నుంచి గుండె వరకు మార్పు తీసుకురాగలదా?

నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…

1 hour ago

వాట్సాప్‌లో కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్? వినియోగదారులకు రాబోయే మార్పులు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…

1 hour ago

మొబైల్ అలవాటు… సంతానంపై ప్రభావం? జేబులో ఫోన్ పెట్టే ముందు తెలుసుకోండి… మీ ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…

2 hours ago

ఎండలో నల్లగా మారిన ముఖం? టానింగ్‌కు చెక్ పెట్టే నాచురల్ సీక్రెట్… పార్లర్ ఖర్చు సేవ్!

వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…

2 hours ago

బాలకృష్ణతో మళ్లీ సినిమాలు ఎందుకు చేయలేదు? విజయశాంతి షాకింగ్ రివీల్!

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

2 hours ago