AP: ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈసారి 164 సీట్ల మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కూటమి అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా వైసిపి నేతలు కార్యకర్తలు అభిమానులు షాక్ అయ్యారు. 2019వ సంవత్సరంలో 151 సీట్లతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ హాస్పిటల్స్ ఎంతో అభివృద్ధి చేశారు అలాగే మెడికల్ కాలేజీలు, పోర్టులు వంటి వాటిని నిర్మిస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను కూడా అందించారు. దీంతో కచ్చితంగా ఈసారి కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు.
ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు ఊహించని విధంగా వైసిపి ఘోరమైన ఓటమిని ఎదుర్కోవడమే కాకుండా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు అయితే వైసీపీ ఫలితాలపై ఇటీవల ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
ఏపీ ఎన్నికల ఫలితాల గురించి ఈయనకు ప్రశ్నలు రావడంతో ఈయన క్లారిటీ ఇచ్చారు. ఈ పార్టీ ఓడిన 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదని తెలిపారు. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని తెలిపారు. ఇక షర్మిలను పావులా ఉపయోగించుకున్నారని, అంతకుమించి ఆమె పాత్ర ఏమాత్రం లేదని కేటీఆర్ తెలిపారు.
కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటి…
ఇక ధర్మవరం ఎమ్మెల్యే గా ఉన్నటువంటి కేతిరెడ్డి ప్రతిరోజు ప్రజలలోకి వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అక్కడే పరిష్కరించేవారు అలాంటి కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమే అంటూ కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.



































