మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరి బ్యాంకు ఖాతాల్లో రేపు (మంగళవారం, 14-04-2020) రూ.1500 లు జమవుతాయని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెల్లరేషన్ కార్డుల లబ్దిదారులకు 74 లక్షలు భ్యాంకు అకౌంట్లలో జమచేస్తామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1112 కోట్ల రూపాయిలను బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పారు. ఆయా బ్యాంకుల లబ్ధిదారులందరికీ రూ.1500 జమ అవుతాయని ట్విట్టర్ లో పేర్కొన్నారు కేటీఆర్.
ఇప్పటికే రాష్ట్రంలో 87శాతం కుటుంబాలకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం పూర్తయిందని చెప్పారు. మొత్తం 76 లక్షలమంది బియ్యం తీసుకున్నారని, ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం చొప్పున అందిందని తెలిపారు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరిగిందని వెల్లడించారు. తెలంగాణా పౌరసరఫరాల శాఖ ఈవిషయంలో అద్భుతంగా పని చేసిందని కొనియాడారు కేటీఆర్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…