కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు, నమ్మకాలు ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. టెక్నాలజీ ఎంత దూసుకుపోతున్నా కొన్ని ప్రాంతాల వారు మాత్రం మూఢనమ్మకాలను నమ్ముతూ వాటినే ఆచరిస్తుంటారు. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే.. పాములను, తేళ్లను చూస్తే వాటికి దూరంగా పోని మనిషి అంటూ ఉండడు.
ఎందుకంటే వాటికి విషం ఉంటుంది కాబట్టి. మహిళలు అయితే బొద్దింకలు, జెర్రులను చూసినా కేకలు వేస్తూ కంగారు పడిపోతుంటారు. ఇక తేళ్లను చూస్తే.. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఉండరు. కానీ ఇక్కడ ఆచారంలో భాగంగా..తమ దేవుడిని దర్శించుకోవాలంటే తేళ్లను తీసుకెళ్లి దర్శించుకుంటారు. అందేంటి అనుకుంటున్నారా.. అయితే వివరంగా తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోడుమూరులో తేళ్లను పట్టుకుంటూ పండగ జరుపుకుంటారు. తేళ్లనే చేతితో పట్టుకొని దేవుడికి హారంగా వేసి పూజిస్తారు. అవి అక్కడ ఉన్న వారికి ఎలాంటి హానీ చేయవంట. ఒకవేళ ఆ తేళ్లు కుట్టినా కూడా.. గుడి చుట్టు మూడు ప్రదక్షిణలు చేస్తే నొప్పి కూడా ఉండదని అక్కడ ప్రజల నమ్మకం. శ్రావణమాసం మూడో సోమవారం ఇక్కడ కొండలరాయుడి స్వామి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు.
ఆకొండపై ఉన్న ఏ రాయిని కదిపినా తేళ్లే కనిపిస్తాయి. అక్కడ తేళ్లను పట్టుకొని దేవుడిని పూజిస్తారు. వాటిని పట్టుకొని విచిత్రమైన విన్యాసాలు చేసినా ఏమి కాదనేది వారి నమ్మకం. కానీ ఇదంతా మూఢ నమ్మకమని.. వాటి వల్ల ప్రమాదం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ ఆచారం కాస్త విచిత్రంగా ఉంది కదు..
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…