Lakshmi Parvathi : సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్యగా అందరికీ తెలిసిన లక్ష్మి పార్వతి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మళ్ళీ మీడియా ముందు తరచూ ఎన్టీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తుంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి అవకాశం దొరికినపుడల్లా వెన్ను పోటు అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. జగన్ నాకు జీవితాన్ని ఇచ్చాడు అంటూ ఎన్టీఆర్ వర్ధంతి నాడు మాట్లాడిన లక్ష్మి పార్వతి గారు మరోసారి లోకేష్ పాదయాత్ర గురించి కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఇక తరచూ నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నడంటూ చెప్పే లక్ష్మి పార్వతి బాలకృష్ణ గురించి ఇంట్రస్టింగ్ విషయాలను మాట్లాడారు.
అన్ స్టాపబుల్ కి పిలిచే దైర్యం బాలయ్యకి ఉందా…
లక్ష్మి పార్వతి ఈమధ్య కాలంలో వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ నందమూరి ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్ గా తారకరత్న మరణించాక లక్ష్మి పార్వతి ఆయన మరణం గురించి అనుమానలను వ్యక్తం చేసారు. ఇక బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి పిలిస్తే వెళ్తారా అంటూ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవగా నేను వెళ్లడం పక్కన పెట్టండి ముందు నన్ను షోకి పిలిచే ధైర్యం బాలకృష్ణ కు ఉందా అంటూ ప్రశ్నించారు.
ఎందుకంటే తన తండ్రి మరణం దగ్గరి నుండి నిజాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది అందుకే నన్ను పిలిచే ధైర్యం బాలయ్య చేయడు అంటూ నవ్వారు. ఎన్నేళ్లు అపద్ధాలు చెప్పినా నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది. నా విషయంలో 26 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాను, ఇప్పటికి తెలుగు ప్రజలకు నిజానిజాలు తెలుస్తున్నాయి అంటూ మాట్లాడారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…