Kethi Reddy: పరాజయంతో మూగబోయిన గుడ్ మార్నింగ్ ధర్మవరం.. ఎమోషనల్ అయిన కేతిరెడ్డి?

Kethi Reddy: 2019 ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయము అందుకున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఎన్నికలలో ఘోర పరాజయం అందుకుంది. ఇక వైసిపి ఎమ్మెల్యేలలో ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి నిత్యం ప్రజలలోనే ఉండేవారు. ప్రతిరోజు ఉదయం గుడ్ మార్నింగ్ అంటూ ధర్మవరంలోని ప్రతి గడపకు వెళుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడే అధికారులు అందరికీ ఫోన్లు చేసే ఆ సమస్యను అక్కడే తీర్చేవారు అలాగే ఎవరికైనా సహాయం కావాలి అంటే ఆయన సొంత డబ్బుతోనే సహాయం చేశారు. ఇలా గత ఐదు సంవత్సరాలుగా ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అంటూ ప్రజల వద్దకు వెళ్లినటువంటి ఈ గొంతు మూగబోయింది.

2024 ఎన్నికల ఫలితాలలో బిజెపి పార్టీ తరపున పోటీ చేసినటువంటి సత్య కుమార్ యాదవ్ అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారు అయితే ఆయన ఎవరు ఏంటి అనేది ఎప్పుడు కూడా ధర్మవరం ప్రజలు చూడలేదు. కానీ ఆయన మాత్రం కేతిరెడ్డి పై సుమారు 3000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇలా వెంకటరామిరెడ్డి ఓడిపోవడంతో ఆయన ఎమోషనల్ అయ్యారు.

ఓటమికి కారణం ఏంటి..
గత ఐదు సంవత్సరాలుగా నిత్యం ప్రజలలోనే ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న నేను ఇలా ఓడిపోవడానికి కారణం ఏంటో అంతు చిక్కడం లేదని ఎమోషనల్ అయ్యారు. ఐదేళ్లుగా నేను పడిన కష్టానికి ఫలితం లేదు కానీ రెండు నెలల ముందు వచ్చి ధర్మవరంలో పర్యటించిన ఆయన గెలవడం ఏంటి అంటూ ఈయన ఎన్నికల ఫలితాలపై సందేహాలను వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago