Laywer Nageswararao : అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ అనే యువకుడి హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపాడు హరిహర కృష్ణ అనే యువకుడు. తన ప్రియురాలు నిహారిక రెడ్డి తో చనువుగా ఉన్నాడన్న కోపంతో పార్టీకి అని పిలిచి అక్కడ గొడవ పడి దారుణంగా నవీన్ హత్య చేసి తల, మొండేం వేరు చేసి గుండెను మార్మాంగాలను అలానే వేళ్ళను సెపరేట్ చేసి ప్రియురాలికి వాట్సాప్ లో ఫోటో తీసి పంపాడు. అయితే ఈ కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస్తోంది. నిహారిక రెడ్డికి అలాగే హరిహర ఇద్దరికీ శిక్ష పడాలి అంటూ నవీన్ కుటుంబం కోరుకుంటోంది. ఇక నిహారికను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అసలు నిహారికకు శిక్ష పడుతుందా లేదా, న్యాయపరంగా ఉన్న విషయాలను హై కోర్ట్ అడ్వకేట్ నాగేశ్వరావు గారు తెలిపారు.
నిహారిక హత్య చేయలేదు… కానీ నిందితురాలే…
నవీన్ హత్య కేసులో మొదటి నుండి నిహారిక రెడ్డి పేరు వినిపిస్తోంది. ఆమె వల్లే హరిహర కృష్ణ, నవీన్ ను చంపాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే నిహారిక రెడ్డి ఇంతవరకు పోలీసులకు ఎక్కడా నిజాలు చెప్పకపోయినా చివరికి పోలీసుల వలలో చిక్కింది. ఆమె హత్య చేయకపోయినా చేసిన హరిహర కు డబ్బులు ఇవ్వడం, హత్య చేసాడని తెలిసినా పోలీసులకు చెప్పక పోవడం వంటివి చేయడం వల్ల ఆమె కూడా శిక్షార్హురాలే అంటూ నాగేశ్వరావు గారు తెలిపారు.
హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి రావడం, విషయాన్ని పోలీసులకు చెప్పకపోవడం వంటివి నేరాలుగా పరిగనిస్తూ ఆమెకు దాదాపు ఏడు సంవత్సరాలు పైనే శిక్ష పడుతుందని వివరించారు. నిహారిక రెడ్డి హరిహర హత్య చేసానని చెప్పిన వెంటనే పోలీసులకు చెప్పి ఉంటే విట్నెస్ అయి ఉండేది. అలా చేయకుండా హరిహర పారిపోడానికి సహకరించడం వల్ల నిందితురాలయింది అంటూ వివరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…