సాధారణంగా మనం పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటే పెద్ద ఎత్తున బంధువులను, సన్నిహితులను, స్నేహితులను ఆహ్వానిస్తాము. అదేవిధంగా మన ఇంట్లో ఏవైనా అల్లారు ముద్దుగా పెంచుకొని ఉన్న పెంపుడు జంతువులను ఈ పుట్టినరోజు వేడుకలలోకి తీసుకు వస్తాము. కానీ పాకిస్తాన్ కి చెందిన ఓ మహిళ ఏకంగా తన పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా సింహాన్ని తీసుకువచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
సుసాన్ ఖాన్ అనే మహిళ లాహోర్ లోని ఓ హోటల్ లో జన్మదిన వేడుక జరుపుకుంది.ఈ విధంగా పుట్టినరోజు వేడుకలలో చీఫ్ గెస్ట్ గా వచ్చిన సింహాన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి గొలుసులతో కట్టేశారు. అదే విధంగా ఈ వేడుకలకు వచ్చిన బంధువులందరూ ఆడుతూ పాడుతూ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తన పుట్టినరోజు వేడుకలలో జరిగిన ఓ వీడియోను సుసాన్ ఖాన్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఈ విధంగా వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అసలు సమస్య మొదలైంది. ఈ వీడియో వైరల్ అవుతూ చివరికి ప్రొటెక్ట్ సేవ్ యానిమల్స్ ప్రతినిధుల కంటపడింది. దీంతో వారు ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి సదరు మహిళ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు అందరూ తనను కఠినంగా శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేశారు. నోరులేని మూగజీవాలకు మత్తు మందు ఇచ్చి తమ ఆనందం కోసం ఈ విధంగా హింసించడం చట్టపరంగా నేరమని, ఈ క్రమంలోనే తనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సమస్యతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు…
దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో కీలక పాత్ర పోషించిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
ఐపీఎల్ 2026 సీజన్లో కీలక మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జట్టు ప్రాక్టీస్ సెషన్లో…
జుట్టు సంరక్షణలో చాలా మంది చేసే ఒక చిన్న పని — దువ్వడం. అయితే ఇది చిన్న విషయం అనిపించినా,…
వైశాఖ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కాలంగా భావించబడుతుంది. ఈ మాసంలో చేసే పూజలు, దానధర్మాలు విశేష ఫలితాలను…