1996 లో ఏ సెలూన్ షాప్ చూసిన అబ్బాస్ బేస్ కటింగ్ కనిపిస్తూ ఉండేది.ఆనాటి యూత్ తమకు తామే అబ్బాస్ లా ఫీలయ్యేవారు. ప్రేమదేశం సినిమా తర్వాత కాలేజీ స్టూడెంట్స్ మొత్తం హీరో అబ్బాస్ లా కటింగ్ చేయించుకున్నారంటే అతిశయోక్తి కాదు. అంతటి స్టైలిష్ కటింగ్ అబ్బాస్ చేయించుకొని తెలుగు, తమిళ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. 1996లో కుంజుమన్ నిర్మాణ సారథ్యంలో కదిర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ దేశం చిత్రంలో అబ్బాస్, వినీత్, టబు హీరో, హీరోయిన్లుగా నటించారు.
రెండు వేరు వేరు కాలేజీలో చదువుకునే ఇద్దరు అబ్బాయిలు తమ శత్రుత్వాన్ని మరిచిపోయి ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు చివరికి ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించిందన్నదే ఈ సినిమా కథ. దర్శకుడు కదీర్ ఎంచుకున్న కథ కొత్తగా లేకపోయినప్పటికీ ప్రజెంటేషన్ టేకింగ్ కొత్తగా ఉండటంతో ముఖ్యంగా అబ్బాస్ హెయిర్ స్టైల్, ఫ్యాషన్ గా కనపడటంతో యూత్ మొత్తం ఎగబడి ప్రేమదేశం సినిమాను చూశారు. తమిళంలో కాదల్ దేశంగా వచ్చిన ఈ సినిమా తెలుగులో ప్రేమ దేశం పేరుతో డబ్ అయింది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాను ఎక్కడికో తీసుకు వెళ్ళింది. ముస్తఫా..ముస్తఫా..అనే సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మారు మోగుతూనే ఉంది. ఐతే అబ్బాస్ పూర్తి పేరు మీర్జా అబ్బాస్ అలీ ఇతను కలకత్తాలో జన్మించాడు. తన తాతగారు ఫిరోజ్ ఖాన్ సినిమా పరిశ్రమలో 1960 నుంచి1970 వరకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రజాదరణ పొందిన నటుడు అని చెప్పవచ్చు. ఐతే 1996లో దర్శకుడు కదీర్ ఓ ప్రేమకథా చిత్రాన్ని తీయాలనుకున్నారు.
ఆ క్రమంలో ఆడిషన్స్ జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకున్న అబ్బాస్ వాటికి హాజరు కావడం జరిగింది. అబ్బాస్ అందులో సెలెక్ట్ అయ్యారు. అలా కదిర్ దర్శకత్వంలో వచ్చిన కాదల్ దేశం అనే తమిళ చిత్రంలో హీరోగా నటించారు.ఆ తర్వాత తమిళ్,తెలుగు కన్నడ మలయాళంలో మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగులో ఆరో ప్రాణం, ప్రియా ఓ ప్రియా, రాజా, అనసూయ లాంటి చిత్రాల్లో అబ్బాస్ నటించాడు. తన సినిమాలకి ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసిన ఎరుమ్ అనే అమ్మాయిని 2000 సం.లో పెళ్లి చేసుకొని ఇద్దరూ కొడుకు, కూతుర్లకు జన్మనిచ్చారు. 2003 సంవత్సరం వచ్చేసరికి అబ్బాస్ కి సరైనటువంటి సినిమా అవకాశాలు లేకపోవడంతో.. ఒక దశలో మానసికంగా కుంగిపోయారు. మనసు కలత చెందడం తో చనిపోదాం అనుకున్నాడు.
కానీ తాను సెల్ఫ్ మోటివేటర్ గా మారి భార్య, పిల్లలతో న్యూజిలాండ్ వెళ్లి అక్కడ ఏ జాబు దొరకకపోవడంతో కొన్ని రోజులు పెట్రోల్ బంకులో పని చేశాడు. అలా తన జీవితాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో.. మెల్లిగా మోటివేషనల్ స్పీకర్ గా మారి అనేక ప్రోగ్రామ్స్ చేశాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ దేశ పౌరసత్వం తీసుకొని మంచి జీవితాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఫేస్ బుక్, ట్విట్టర్ లో తన అభిమానుల కోసం కొత్త ఫోటోలు పెడుతూ తన మనసులోని భావాలను పంచుకుంటున్నాడు.
భారతీయ జీవన విధానంలో నేలపై కూర్చుని భోజనం చేయడం ఒక పాత సంప్రదాయం. పూర్వం నుంచి పెద్దలు ఈ అలవాటును…
సీనియర్ నటుడు నరసింహరాజు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, అలాగే గతంలో తనపై వచ్చిన…
హైదరాబాద్ నగర ప్రజలకు త్వరలోనే మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున ప్రయాణాలు చేసే వారికి…
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మందిని ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి…
ఇంట్లో చిన్న మొక్కలు పెంచుకోవడం ఇప్పుడు అలవాటుగా మారింది. అందులో ముఖ్యంగా Money Plantకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ…
మన వంటింట్లో సాధారణంగా ఉపయోగించే కూరగాయల్లో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. అయితే వాటిలోని కొన్ని భాగాలను మనం పట్టించుకోకుండా…