Connect with us

Featured

హీరో అబ్బాస్ సినిమాలు లేక.. చనిపోదాం అనుకుని..! పాపం చివరికి భార్యా పిల్లలతో దేశం విడిచి వెళ్ళిపోయారు..?!

Published

on

1996 లో ఏ సెలూన్ షాప్ చూసిన అబ్బాస్ బేస్ కటింగ్ కనిపిస్తూ ఉండేది.ఆనాటి యూత్ తమకు తామే అబ్బాస్ లా ఫీలయ్యేవారు. ప్రేమదేశం సినిమా తర్వాత కాలేజీ స్టూడెంట్స్ మొత్తం హీరో అబ్బాస్ లా కటింగ్ చేయించుకున్నారంటే అతిశయోక్తి కాదు. అంతటి స్టైలిష్ కటింగ్ అబ్బాస్ చేయించుకొని తెలుగు, తమిళ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. 1996లో కుంజుమన్ నిర్మాణ సారథ్యంలో కదిర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ దేశం చిత్రంలో అబ్బాస్, వినీత్, టబు హీరో, హీరోయిన్లుగా నటించారు.

రెండు వేరు వేరు కాలేజీలో చదువుకునే ఇద్దరు అబ్బాయిలు తమ శత్రుత్వాన్ని మరిచిపోయి ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు చివరికి ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించిందన్నదే ఈ సినిమా కథ. దర్శకుడు కదీర్ ఎంచుకున్న కథ కొత్తగా లేకపోయినప్పటికీ ప్రజెంటేషన్ టేకింగ్ కొత్తగా ఉండటంతో ముఖ్యంగా అబ్బాస్ హెయిర్ స్టైల్, ఫ్యాషన్ గా కనపడటంతో యూత్ మొత్తం ఎగబడి ప్రేమదేశం సినిమాను చూశారు. తమిళంలో కాదల్ దేశంగా వచ్చిన ఈ సినిమా తెలుగులో ప్రేమ దేశం పేరుతో డబ్ అయింది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాను ఎక్కడికో తీసుకు వెళ్ళింది. ముస్తఫా..ముస్తఫా..అనే సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మారు మోగుతూనే ఉంది. ఐతే అబ్బాస్ పూర్తి పేరు మీర్జా అబ్బాస్ అలీ ఇతను కలకత్తాలో జన్మించాడు. తన తాతగారు ఫిరోజ్ ఖాన్ సినిమా పరిశ్రమలో 1960 నుంచి1970 వరకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రజాదరణ పొందిన నటుడు అని చెప్పవచ్చు. ఐతే 1996లో దర్శకుడు కదీర్ ఓ ప్రేమకథా చిత్రాన్ని తీయాలనుకున్నారు.

ఆ క్రమంలో ఆడిషన్స్ జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకున్న అబ్బాస్ వాటికి హాజరు కావడం జరిగింది. అబ్బాస్ అందులో సెలెక్ట్ అయ్యారు. అలా కదిర్ దర్శకత్వంలో వచ్చిన కాదల్ దేశం అనే తమిళ చిత్రంలో హీరోగా నటించారు.ఆ తర్వాత తమిళ్,తెలుగు కన్నడ మలయాళంలో మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగులో ఆరో ప్రాణం, ప్రియా ఓ ప్రియా, రాజా, అనసూయ లాంటి చిత్రాల్లో అబ్బాస్ నటించాడు. తన సినిమాలకి ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసిన ఎరుమ్ అనే అమ్మాయిని 2000 సం.లో పెళ్లి చేసుకొని ఇద్దరూ కొడుకు, కూతుర్లకు జన్మనిచ్చారు. 2003 సంవత్సరం వచ్చేసరికి అబ్బాస్ కి సరైనటువంటి సినిమా అవకాశాలు లేకపోవడంతో.. ఒక దశలో మానసికంగా కుంగిపోయారు. మనసు కలత చెందడం తో చనిపోదాం అనుకున్నాడు.

కానీ తాను సెల్ఫ్ మోటివేటర్ గా మారి భార్య, పిల్లలతో న్యూజిలాండ్ వెళ్లి అక్కడ ఏ జాబు దొరకకపోవడంతో కొన్ని రోజులు పెట్రోల్ బంకులో పని చేశాడు. అలా తన జీవితాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో.. మెల్లిగా మోటివేషనల్ స్పీకర్ గా మారి అనేక ప్రోగ్రామ్స్ చేశాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ దేశ పౌరసత్వం తీసుకొని మంచి జీవితాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఫేస్ బుక్, ట్విట్టర్ లో తన అభిమానుల కోసం కొత్త ఫోటోలు పెడుతూ తన మనసులోని భావాలను పంచుకుంటున్నాడు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Venu Swamy: ఆవిడ నన్ను ప్రేమించింది.. నేను ప్రేమించాల్సి వచ్చింది: వేణు స్వామి రియల్

Published

on

Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఈయన ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచు వార్తల్లో నిలిచారు. కేవలం రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఈయన పెద్ద ఎత్తున అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల కాలంలో వేణు స్వామి తన భార్య వీణా వాణితో కలిసి రీల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల క్రితం ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలోని డైలాగుకు రీల్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే తాజాగా మరొకరి వీడియో ద్వారా ఈయన అభిమానుల ముందుకు వచ్చారు.

ఈ క్రమంలోనే నాగార్జున సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన మన్మధుడు సినిమాలోని ఒక సీన్ రీ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున సోనాలి బింద్రే ఇద్దరు ప్యారిస్ వెళ్లగా అక్కడ బ్రహ్మానందంతో ఓ సన్నివేశం వస్తుంది. మీ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అంటూ నాగార్జున బ్రహ్మానందం ని అడగడంతో అందుకు ఆయన చెబుతూ మొదట ఆమె నన్ను ప్రేమించింది తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అనే డైలాగును వేణు స్వామి కూడా రీ క్రియేట్ చేశారు.

Advertisement

ఊపిరి పీల్చుకో..

ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వామ్మో వేణు స్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా సోషల్ మీడియా ఇక ఊపిరి పీల్చుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా జ్యోతిష్యం చెబుతూనే వార్తలలో నిలిచినటువంటి ఈయన ఇప్పుడు మాత్రం రీల్స్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారని చెప్పాలి.

https://www.instagram.com/reel/C5oDUlhxisr/?utm_source=ig_embed&ig_rid=c69f6a00-74ea-461b-b532-7e7a5316f48a

Advertisement

Continue Reading

Featured

Rashmika: నాకంటే అందగత్తెలు ఉన్నారు.. రష్మిక కామెంట్స్ వైరల్!

Published

on

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా స్టార్ డం గురించి ఈమె మాట్లాడారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నాకంటే ఎంతో అందమైన అమ్మాయిలు ఉన్నారు అలాగే బాగా నటించగలిగే వారు ఉన్నారు వారందరూ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని తెలిపారు.

ఇలా నేను ఇక్కడ వాళ్లు అక్కడ ఉండటానికి కారణం అదృష్టం మాత్రమేనని ఈమె తెలిపారు. నాకు అదృష్టం రావడంతో ఇక్కడికి వచ్చానని ఈమె తెలియజేశారు. ఇలా వచ్చిన అదృష్టాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకొని నన్ను నేను నిరూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేశానని రష్మిక తెలిపారు.

Advertisement

పతనానికి కారణం..
సినిమా ఇండస్ట్రీలో అని మాత్రమే కాదు ఏ రంగంలో అయినా కూడా జయాలు అపజయాలు అనేది సర్వసాధారణంగా ఉంటాయి అయితే మనం విజయం సాధించినప్పుడు ఆ పొగరు తలకెక్కించుకోకూడదు అలా ఎక్కించుకున్నాము అంటే ఆ ప్రభావం మన మనసుపై పడుతుందని అది పతనానికి కారణం అవుతుంది అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. ఇది వారందరికీ దక్కిన గౌరవం అంటూ?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇటీవల చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీకి అందించినటువంటి సేవలను గుర్తించినటువంటి వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం జరిగినటువంటి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన డాక్టరేట్ అందుకోవడంతో రామ్ చరణ్ కాస్త ఇకపై డాక్టర్ రామ్ చరణ్ గా మారిపోయారని చెప్పాలి. ఇక ఈయనకు డాక్టర్ అందించడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా డాక్టరేట్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చెన్నైలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేల్స్ యూనివర్సిటీ నుంచి నాకు ఈ గౌరవం దక్కడం నిజంగా సంతోషంగా అనిపిస్తుందని ఈయన వెల్లడించారు. ఆర్మీ లాంటి గ్రాడ్యుయేషన్ మధ్యలో నేను ఇలా ఈరోజు ఉండటం  ఊహిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

అందరి గౌరవం ఇదీ…
ఈరోజు ఇలా డాక్టరేట్ అందుకున్నాను అంటే అది కేవలం నాకు దగ్గర గౌరవం మాత్రమే కాదని తెలిపారు నన్ను ఆదరించిన అభిమానులది నన్ను నమ్మి సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలది అంటూ రాంచరణ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ యూనివర్సిటీని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఇక్కడ నిర్వాహకులకు అధ్యాపకులకు అలాగే విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!