భారత్ లో మార్చి నెల తొలి వారం నుంచి కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణతో గతంలో ప్రజలకు ఎప్పుడూ తెలియని లాక్ డౌన్ పరిచయమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని సూచించాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భారత్ తో పాటు ఇతర దేశాలు సైతం లాక్ డౌన్ పైనే ఆధారపడ్డాయి. అయితే చైనా లాక్ డౌన్ పేరుతో పెద్ద కుట్రకు తెర లేపిందని తెలుస్తోంది.
చైనా దేశంలోని వుహాన్ నుంచి కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. వైరస్ పుట్టుకకు కారణమైన చైనాలో సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటే ఇతర దేశాల్లో మాత్రం వైరస్ అడ్డూఅదుపు లేకుండా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాప్తి చెందిన తరువాత చైనా కఠినమైన లాక్ డౌన్ తోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకున్నట్లు వెల్లడించింది. అయితే చైనా మాటల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.
నిజానికి కరోనా అంత ప్రమాదకరమైన వైరస్ కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సాధారణ పరిస్థితులు ఉన్నా వైరస్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం సాధ్యమే. అయితే ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం చైనా లాక్ డౌన్ ను తెరపైకి తెచ్చింది. ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను అమలు చేయడం ద్వారా ఆయా దేశాలు ఆర్థికంగా నష్టపోవడానికి చైనా కారణమైంది.
అమెరికన్ లాయర్ మైకెల్ సెంగర్ మాట్లాడుతూ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చైనా ఈ తరహా కుట్రకు తెర లేపిందని చెప్పారు. చైనా కావాలనే కఠినమైన నిబంధనలను చైనాలోని వుహాన్ లో మాత్రమే అమలయ్యేలా చేసి ఇతర దేశాలు కూడా ఆ విధానాన్ని అవలంబించేలా చేసిందని అన్నారు. చైనా తప్పుడు సమాచారం వల్లే ప్రపంచ దేశాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…