Featured

కేంద్రం కీలక నిర్ణయం.. గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు శుభవార్త..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలోని ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ దేశంలో గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ను ప్రైవేట్ పరం చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం బీపీసీఎల్ ను ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో చాలామంది గ్యాస్ వినియోగదారులు ఇకపై కేంద్రం ఇచ్చే సబ్సిడీని పొందలేదమని భావించారు.

కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా బీపీసీఎం వాటాలను విక్రయిస్తోంది. దీంతో చాలామంది వినియోగదారులు ఇకపై వంట గ్యాస్ సబ్సిడీని పొందలేమని భావిస్తున్న తరుణంలో కేంద్రం స్పందించి స్పష్టతనిచ్చింది. చమురు మంత్రిత్వ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బీపీసీఎల్ కస్టమర్లకు గ్యాస్ సబ్సిడీ విషయంలో ఆందోళన చెందవద్దని కీలక సూచనలు చేశారు.

బీపీసీఎం ప్రైవేట్ పరం అయినా వంటగ్యాస్ పై సబ్సిడీ యథాతథంగా కొనసాగుతుందని ప్రజలు అనవసర భయాందోళనకు గురి కావద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కంపెనీలతో సంబంధం లేకుండా వంట గ్యాస్ సబ్సిడీని నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేస్తుందని అందువల్ల మధ్యలో ఎటువంటి కంపెనీలు లేవు కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

చమురు రంగ సంస్థలు ప్రభుత్వ కంపెనీలు అయినా ప్రైవేట్ కంపెనీలు అయినా ఎల్పీజీ సబ్సిడీ యథాతథంగా కొనసాగుతుందని అందువల్ల ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించింది. కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు సంవత్సరానికి 12 సిలిండర్లను సబ్సిడీ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…

12 minutes ago

భారత ఆధ్యాత్మికతను మార్చిన ఇద్దరు మహానుభావులు! అద్వైతం, విశిష్టాద్వైతం.. అసలు తేడా ఏమిటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…

42 minutes ago

ఊరికి వస్తే చంపేస్తామంటూ హెచ్చరిక.. నటి షాకింగ్ అనుభవాలు

తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…

1 hour ago

విష్ణువు అవతారాల్లో ప్రత్యేకమైనది ఎందుకు పరశురాముడు?

హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…

1 hour ago

రోజా రీ-ఎంట్రీ రెడీ.. ‘ఫ్యామిలీ అసెంబ్లీ’తో బుల్లితెరపై సందడి

సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…

2 hours ago

తమన్నా పిటిషన్‌కు షాక్.. హైకోర్టు కీలక తీర్పు

ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…

2 hours ago